AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: ఆ ఆలయానికి ముఖేష్‌ అంబానీ రూ.10 కోట్ల విరాళం

Mukesh Ambani: దాదాపు 20 సంవత్సరాలుగా తాను ఉత్తరాఖండ్‌ను సందర్శిస్తున్నానని, అయితే ఇటీవలి సంవత్సరాలలో ఇంత అద్భుతమైన ఏర్పాట్లను తాను ఎప్పుడూ చూడలేదని అంబానీ అన్నారు. ముఖ్యమంత్రి ధామి నాయకత్వంలో జరుగుతున్న చారిత్రాత్మక పనిని ఆయన ప్రశంసించారు. రాబోయే 10 సంవత్సరాలలో..

Mukesh Ambani: ఆ ఆలయానికి ముఖేష్‌ అంబానీ రూ.10 కోట్ల విరాళం
Subhash Goud
|

Updated on: Oct 12, 2025 | 7:58 AM

Share

Mukesh Ambani Donated: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలను సందర్శించి, ఈ పవిత్ర పుణ్యక్షేత్రాలకు రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు. బద్రీనాథ్ చేరుకున్న ఆయనకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) చైర్మన్ హేమంత్ ద్వివేది స్వాగతం పలికి, ఉత్తరాఖండ్ సాంప్రదాయ టోపీని బహుకరించారు.

ఇది కూడా చదవండి: Diwali Cleaning: దీపావళికి ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన కవర్‌.. ఓపెన్‌ చేసి చూడగా షాకైన కుటుంబీకులు

బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లను సందర్శించిన తర్వాత ముఖేష్ అంబానీ హేమంత్ ద్వివేదితో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నాయకత్వంలో ఈ సంవత్సరం చార్‌ధామ్ యాత్ర చాలా బాగా జరుగుతోందని అన్నారు. ధామి ప్రభుత్వం తీర్థయాత్ర మార్గంలోని అనేక ప్రదేశాలలో యాత్రికుల కోసం అద్భుతమైన సౌకర్యాలను కల్పించిందని ఆయన వివరించారు. ఇటువంటి సురక్షితమైన, చక్కటి వ్యవస్థీకృత ఏర్పాట్లు ఇతర మతపరమైన ప్రదేశాలలో చాలా అరుదుగా కనిపిస్తాయని అన్నారు..

ఇది కూడా చదవండి: Astrology: ఈ నెలలో పుట్టిన అమ్మాలు అందంలో అప్సరసలే.. కుర్రాళ్ళు పెళ్లంటూ చేసుకుంటే వీరినే చేసుకోవాలి..!

దాదాపు 20 సంవత్సరాలుగా తాను ఉత్తరాఖండ్‌ను సందర్శిస్తున్నానని, అయితే ఇటీవలి సంవత్సరాలలో ఇంత అద్భుతమైన ఏర్పాట్లను తాను ఎప్పుడూ చూడలేదని అంబానీ అన్నారు. ముఖ్యమంత్రి ధామి నాయకత్వంలో జరుగుతున్న చారిత్రాత్మక పనిని ఆయన ప్రశంసించారు. రాబోయే 10 సంవత్సరాలలో ఉత్తరాఖండ్‌ను సందర్శించే యాత్రికుల సంఖ్య వేగంగా పెరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల కారనంగా మరణించిన కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు, ప్రతి క్లిష్ట సమయంలోనూ తాను, రిలయన్స్ ఫౌండేషన్ ఉత్తరాఖండ్‌కు తోడుగా ఉంటామని చెప్పారు.

ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి హామీ:

ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, దేవాలయాలు, పర్యావరణ పరిరక్షణకు తన పూర్తి మద్దతును అందిస్తామని ముఖేష్ అంబానీ హామీ ఇచ్చారు. అంబానీ కుటుంబం చాలా సంవత్సరాలుగా బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలకు తోడ్పడుతోంది. వైష్ణవ శాఖ భక్తులకు బద్రీనాథ్ ఒక పవిత్ర స్థలం. ఇది విష్ణువు 108 దివ్య దేశాలలో ఒకటి. బద్రీనాథ్ పట్టణంలో పంచ బద్రీ ఆలయాల సమూహం కూడా ఉంది. వీటిలో యోగా ధ్యాన బద్రీ, భవిష్య బద్రీ, ఆది బద్రీ, వృద్ధ బద్రీ, బద్రీనాథ్ ఆలయం (బద్రీ విశాల్) ఉన్నాయి. హిందూ సంప్రదాయం ప్రకారం, హిందూ మతం కోల్పోయిన ప్రతిష్టను పునరుద్ధరించడానికి, దేశాన్ని ఏకం చేయడానికి ఆది శంకరాచార్యులు బద్రీనాథ్ ఆలయాన్ని (బద్రీ విశాల్) తిరిగి స్థాపించారు.

ఇది కూడా చదవండి: BSNL: కేవలం 319 రూపాయలకే 65 రోజుల చెల్లుబాటు.. అద్భుతమైన ప్లాన్‌.. బెనిఫిట్స్‌ ఇవే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి