ఆసియాలో సంపన్నుడిగా మళ్లీ ముకేశ్ అంబానీయే టాప్

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి ఆసియాలోనే అత్యంత సంపన్నుడి స్థానాన్ని దక్కించుకున్నారు. జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ 9.99 శాతం వాటాను కొనుగోలు చేసిన తర్వాత ముకేశ్ సంపద..

ఆసియాలో సంపన్నుడిగా మళ్లీ ముకేశ్ అంబానీయే టాప్

Edited By:

Updated on: Apr 23, 2020 | 5:46 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి ఆసియాలోనే అత్యంత సంపన్నుడి స్థానాన్ని దక్కించుకున్నారు. జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ 9.99 శాతం వాటాను కొనుగోలు చేసిన తర్వాత ముకేశ్ సంపద 49.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో అలీబాబా గ్రూప్ అధినేత ‘జాక్‌ మా’ను వెనక్కి నెట్టి ఆసియా అపరకుబేరుడి స్థానాన్ని తిగి పొందారు.

46 బిలియన్ డాలర్ల సంపదతో ఇప్పటివరకూ ఆసియా కుబేరుడిగా ఉన్న జాక్ మాను అధిగమించి ముకేశ్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తమ డిజిటల్ విభాగాలన్నింటినీ సంఘటితం చేసి ‘జియో ఫ్లాట్‌ఫామ్స్‌’గా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని అతి పెద్ద డిజిటల్ సంస్థగా మార్చేందుకు రిలయన్స్ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో తమ లక్ష్య సాధనకు ఫేస్‌బుక్‌తో కుదిరిన ఒప్పందం మంచిగా కుదిరిందని రిలయన్స్ సంస్థ భావిస్తోంది.

Read More: 

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్

కోట్ల మంది ఫేస్‌బుక్ డేటా చోరీ.. రూ.41 వేలకు అమ్మకం