AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST: పన్ను ఎగవేతను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత ఆదాయం

గూడ్స్ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం శుభవార్తలను అందుకుంటూనే ఉంది. ప్రభుత్వం ప్రతినెలా రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో..

GST: పన్ను ఎగవేతను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత ఆదాయం
Gst
Subhash Goud
|

Updated on: Feb 02, 2023 | 8:45 PM

Share

గూడ్స్ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం శుభవార్తలను అందుకుంటూనే ఉంది. ప్రభుత్వం ప్రతినెలా రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు సగటున రూ.1.50 లక్షల కోట్లుగా ఉండవచ్చని అంచనా. దీనితో పాటు పరోక్ష పన్నులు, కస్టమ్ (సీబీఐసీ) విభాగం అధిపతి వివేక్ జోహ్రీ ఈ విషయాన్ని తెలిపారు.

పన్ను ఎగవేతను నిరోధించడానికి, కొత్త వ్యాపారాలను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావడానికి సమిష్టి ప్రయత్నాల వల్ల ఈ కొత్త ‘సాధారణ’ స్థాయి పన్ను వసూళ్లు జరుగుతాయని చెప్పారు. 2023-24 సాధారణ బడ్జెట్‌లో అందించిన జీఎస్టీ, కస్టమ్స్ ఆదాయ సేకరణ అంచనాలు వాస్తవికమైనవి, ప్రస్తుత ధరలు, దిగుమతుల ప్రకారం.. జీడీపీ వృద్ధిపై ఆధారపడి ఉన్నాయని జోహ్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

పరోక్ష పన్ను వసూళ్ల లక్ష్యం నెరవేరుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన పరోక్ష పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. పన్ను రిటర్నుల కఠినమైన ఆడిట్, పరిశీలన, మోసపూరిత బిల్లింగ్, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌లపై అమలు చర్యల ద్వారా జిఎస్‌టి వసూళ్లను పెంచడానికి సిబిఐసి ఒక వ్యూహాన్ని రూపొందించిందని జోహ్రీ చెప్పారు.

ఇవి కూడా చదవండి

పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెంచడంపై దృష్టి:

పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. పన్ను చెల్లింపుదారుల బేస్‌లో వృద్ధి చాలా బాగుంది. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పటి నుండి పన్ను చెల్లింపుదారుల సంఖ్యను రెండింతలకంటే ఎక్కువ చేస్తామన్నారు. అయితే, పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచే అవకాశం ఉన్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయని భావిస్తున్నామని అన్నారు.

వసూళ్లు రూ. 1.45 లక్షల కోట్లు ఉండవచ్చు:

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ జీఎస్‌టీ వసూళ్లు సగటున రూ. 1.45 లక్షల కోట్లుగా ఉండవచ్చని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నెలవారీ జీఎస్‌టీ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్లను సులభంగా సాధించగలని అన్నారు. జీఎస్‌టీ రాబడిని పెంచడానికి మరింత అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కేవలం 2-3 గంటల్లోనే పాలు తోడుకోవాలంటే ఇలా చేయండి..
కేవలం 2-3 గంటల్లోనే పాలు తోడుకోవాలంటే ఇలా చేయండి..
మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు బలహీనంగా మారుతున్నాయా? అలసత్వం వద్దు
మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు బలహీనంగా మారుతున్నాయా? అలసత్వం వద్దు
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..
20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్
20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్
చికెన్ vs చేపలు.. వర్షాకాలంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
చికెన్ vs చేపలు.. వర్షాకాలంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
దిగ్గజ గాయని జానకమ్మ జీవితంలో ఇంత అందమైన ప్రేమకథ ఉందా?
దిగ్గజ గాయని జానకమ్మ జీవితంలో ఇంత అందమైన ప్రేమకథ ఉందా?
కరివేపాకు గుబురుగా పెరగడం లేదా? తోటమాలి చెప్పే 2 సూపర్‌ ట్రిక్స్‌
కరివేపాకు గుబురుగా పెరగడం లేదా? తోటమాలి చెప్పే 2 సూపర్‌ ట్రిక్స్‌
చిరాకు, నీరసం తగ్గి.. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..
చిరాకు, నీరసం తగ్గి.. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..
ఈ అట్టర్ ఫ్లాప్ టీంతో టీ20 ప్రపంచకప్ 2028కు వెళ్తారా..?
ఈ అట్టర్ ఫ్లాప్ టీంతో టీ20 ప్రపంచకప్ 2028కు వెళ్తారా..?
చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా..
చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా..