AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST: పన్ను ఎగవేతను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత ఆదాయం

గూడ్స్ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం శుభవార్తలను అందుకుంటూనే ఉంది. ప్రభుత్వం ప్రతినెలా రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో..

GST: పన్ను ఎగవేతను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత ఆదాయం
Gst
Subhash Goud
|

Updated on: Feb 02, 2023 | 8:45 PM

Share

గూడ్స్ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం శుభవార్తలను అందుకుంటూనే ఉంది. ప్రభుత్వం ప్రతినెలా రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు సగటున రూ.1.50 లక్షల కోట్లుగా ఉండవచ్చని అంచనా. దీనితో పాటు పరోక్ష పన్నులు, కస్టమ్ (సీబీఐసీ) విభాగం అధిపతి వివేక్ జోహ్రీ ఈ విషయాన్ని తెలిపారు.

పన్ను ఎగవేతను నిరోధించడానికి, కొత్త వ్యాపారాలను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావడానికి సమిష్టి ప్రయత్నాల వల్ల ఈ కొత్త ‘సాధారణ’ స్థాయి పన్ను వసూళ్లు జరుగుతాయని చెప్పారు. 2023-24 సాధారణ బడ్జెట్‌లో అందించిన జీఎస్టీ, కస్టమ్స్ ఆదాయ సేకరణ అంచనాలు వాస్తవికమైనవి, ప్రస్తుత ధరలు, దిగుమతుల ప్రకారం.. జీడీపీ వృద్ధిపై ఆధారపడి ఉన్నాయని జోహ్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

పరోక్ష పన్ను వసూళ్ల లక్ష్యం నెరవేరుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన పరోక్ష పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. పన్ను రిటర్నుల కఠినమైన ఆడిట్, పరిశీలన, మోసపూరిత బిల్లింగ్, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌లపై అమలు చర్యల ద్వారా జిఎస్‌టి వసూళ్లను పెంచడానికి సిబిఐసి ఒక వ్యూహాన్ని రూపొందించిందని జోహ్రీ చెప్పారు.

ఇవి కూడా చదవండి

పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెంచడంపై దృష్టి:

పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. పన్ను చెల్లింపుదారుల బేస్‌లో వృద్ధి చాలా బాగుంది. జీఎస్టీని ప్రవేశపెట్టినప్పటి నుండి పన్ను చెల్లింపుదారుల సంఖ్యను రెండింతలకంటే ఎక్కువ చేస్తామన్నారు. అయితే, పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచే అవకాశం ఉన్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయని భావిస్తున్నామని అన్నారు.

వసూళ్లు రూ. 1.45 లక్షల కోట్లు ఉండవచ్చు:

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ జీఎస్‌టీ వసూళ్లు సగటున రూ. 1.45 లక్షల కోట్లుగా ఉండవచ్చని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నెలవారీ జీఎస్‌టీ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్లను సులభంగా సాధించగలని అన్నారు. జీఎస్‌టీ రాబడిని పెంచడానికి మరింత అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌