AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Employees: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి

Employees: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఉద్యోగులకు డీఏ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం..

Employees: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి
Subhash Goud
|

Updated on: Aug 27, 2022 | 6:35 AM

Share

Employees: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఉద్యోగులకు డీఏ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఉద్యోగులకు ఈ డీఏ పెంపు నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డియర్‌నెస్‌ అలవెన్స్‌లో మూడు శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగులకు ఈ పెంపు ఉంటుంది.

రాష్ట్రంలో కరువు భత్యం ఎంత?

మధ్యప్రదేశ్ ప్రభుత్వ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఇతర ఉద్యోగులకు ఇప్పటి వరకు 31 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (DA) పొందుతారు. అయితే ఇప్పుడు పెంపు నిర్ణయం తర్వాత అది 34 శాతానికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వ ఈ ప్రకటనతో 30 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ పెరిగిన డీఏ ఆగస్టు 1 నుంచి వర్తిస్తుంది. ఎన్నికల ముందు ఉద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. డీఏ పెంపు ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ప్రభుత్వ ఈ ప్రకటన తర్వాత రాష్ట్ర బడ్జెట్‌పై పెను ప్రభావం చూపనుంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమంత్రి గతంలో కూడా ప్రకటించారు

ఇంతకుముందు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచారు. వారికి డీఏ 31 శాతం నుంచి 34 శాతానికి పెంచారు. ఈ ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 7.5 లక్షల మంది నేరుగా లబ్ధి పొందనున్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 34 శాతం నుంచి 38 శాతానికి పెంచుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. మరికొద్ది వారాల్లో కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆవకాయ తర్వాత అంత క్రేజ్ ఉన్న పచ్చడి ఇదే.. రుచిలో మాత్రం రాజీ లేదు
ఆవకాయ తర్వాత అంత క్రేజ్ ఉన్న పచ్చడి ఇదే.. రుచిలో మాత్రం రాజీ లేదు
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అప్డేట్
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అప్డేట్
నాడు గన్.. నేడు నాగలి.. వ్యవసాయం పనుల్లో మహిళా మావోయిస్టు
నాడు గన్.. నేడు నాగలి.. వ్యవసాయం పనుల్లో మహిళా మావోయిస్టు
అంతా రామమయం అనుకుంటే.. విరాళాల చోరీతో మొదలై భారీ స్కామ్‌గా మారిన
అంతా రామమయం అనుకుంటే.. విరాళాల చోరీతో మొదలై భారీ స్కామ్‌గా మారిన
సికింద్రాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉచిత టిఫిన్..
సికింద్రాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉచిత టిఫిన్..
రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన నిలిచిన జక్కన్న
రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన నిలిచిన జక్కన్న
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?