AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి భగ్గుమన్న గ్యాస్ ధర.. సిలిండర్‌పై రూ.35 పెంపు

వంటగ్యాస్ సిలిండర్ ధర మరోసారి భగ్గుమంది. 19 కిలోల సిలిండర్ ధర పెంచింది. ఒక్కో సిలిండర్‌పై రూ.32 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి కంపెనీలు.

మరోసారి భగ్గుమన్న గ్యాస్ ధర.. సిలిండర్‌పై రూ.35 పెంపు
Balaraju Goud
|

Updated on: Oct 01, 2020 | 4:17 PM

Share

వంటగ్యాస్ సిలిండర్ ధర మరోసారి భగ్గుమంది. అంతర్జాతీయంగా చమురు ధరలకు తగ్గట్టుగా దేశంలో వంటగ్యాస్ రేట్లను క్రమబద్ధీకరిస్తూ … లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ధరను పెంచేశాయి కంపెనీలు. చమురు మార్కెటింగ్ సంస్థలు కాగా, ఎల్పీజీ గ్యాస్ ధరలో ఎటువంటి మార్పులు చేయలేదు. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ లేని ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.594 గా ఉన్నది. అయితే, 19 కిలోల సిలిండర్ ధరల్లో మాత్రం పెంచింది. ఒక్కో సిలిండర్‌పై రూ.32 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి కంపెనీలు.

ఇండియన్ అయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ధర ప్రకారం ఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ రూ.32.50 వరకు పెంచింది. ప్రస్తుతం ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1133.50 ఉండగా ఇకపై రూ.32.50 పెరిగి రూ.1166 కు చేరుకుంది. ఇక, ముంబైలో 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1089 నుంచి రూ.1113.50 కు పెరిగింది. దేశంలోని ఇతర నగరాల్లో సిలిండర్‌పై రూ.35 వరకు పెంచాయి గ్యాస్ కంపెనీలు.

ఈ ఏడాది జూన్ నెలలో ఇలాగే ధర పెంచిన కంపెనీలు… మళ్లీ జులై రాగానే మరోసారి పెంచేశాయి. ఆతర్వాత ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. తాజాగా మరోసారి గ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.