
పేటీఎంపై ఆర్బీఐ తీసుకున్న చర్యలు అమల్లోకి వచ్చిన విషయం విధితమే. ముఖ్యంగా మార్చి 15 నుంచి కొత్త డిపాజిట్ల అంగీకార గడువు అమలులోకి వచ్చినందున పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ కష్టమర్లు తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాల సమితిని విడుదల చేసింది. ఈ ఎఫ్ఏక్యూలు పేటీఎం బ్యాంక్ వెబ్ సైట్లో ప్రచురించారు. అలాగే పేటీఎం పేమెంట్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్ వినియోగంపై తన వైఖరిని స్పష్టం చేసింది . దీని ప్రకారం వినియోగదారులు తమ వ్యాలెట్లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ వరకు ఎనేబుల్ చేసిన టోల్, పార్కింగ్ వ్యాపారుల వద్ద చెల్లించడానికి ఫాస్టాగ్ను ఉపయోగించవచ్చు. అయితే పేటీఎం ఫాస్టాగ్స్లో టాప్అప్లు మాత్రం అందుబాటులోఉండవు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన పాత ఫాస్టాగ్ నుంచి మరొక బ్యాంక్ నుండి పొందినా కొత్త ఫాస్టాగ్కు క్రెడిట్ బ్యాలెన్స్ బదిలీ ఫీచర్ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో పేటీఎం ఫాస్టాగ్ను ఎలా మూసేయాలో? తెలుసుకుందాం.
పేటీెం పేమెంట్స్ బ్యాంక్ ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్ల నుంచి నిధులను ఉపసంహరించుకోవడంపై ఎలాంటి పరిమితులు లేవని తెలిపింది. ఖాతాలు, వ్యాలెట్స్లో ఇప్పటికే ఉన్న బ్యాలెన్స్లు సురక్షితంగా ఉన్నాయని ఆర్బీఐ పేర్కొన్న నేపథ్యంలో డిపాజిట్ చేసిన నిధుల భద్రతకు సంబంధించిన ఆందోళనలను తగ్గిస్తుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి సంబంధించిన ప్రాముఖ్యతను నిపుణులు సూచిస్తున్నప్పటికీ పేటీఎంలో ఉన్న నగదు సురక్షితంగా ఉంది. అయితే వీలైనంత త్వరగా మన సొమ్మును విత్డ్రా చేసుకోవడం ఉత్తమమని నిపుణుల వాదన. ముఖ్యంగా బ్యాంకింగ్ నిబంధనలకు అనుగుణంగా సొమ్ముపై పూర్తి బాధ్యత ఖాతాదారుడికే ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి