AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ఇప్పుడు 8 గంటలకు ముందుగానే.. తుది చార్ట్‌ కూడా ఉంటుందని తెలుసా? ఎంత సమయానికి ముందుగా..

Indian Railways: రైళ్ల చార్ట్‌ను 8 గంటల ముందుగానే సిద్ధం చేయాలని సూచనలు జారీ చేసింది రైల్వే. కానీ తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ కోటాలో ఎటువంటి మార్పు చేయలేదు. ఈ విధంగా చార్ట్ సిద్ధం చేయబడి ఆ రైలులో తత్కాల్..

Indian Railways: ఇప్పుడు 8 గంటలకు ముందుగానే.. తుది చార్ట్‌ కూడా ఉంటుందని తెలుసా? ఎంత సమయానికి ముందుగా..
Subhash Goud
|

Updated on: Jul 09, 2025 | 6:15 PM

Share

ఇటీవల భారతీయ రైల్వే చార్ట్ తయారీ సమయాన్ని మార్చింది. గతంలో రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు దీనిని తయారు చేసేవారు. కానీ ఇప్పుడు దీనిని ఎనిమిది గంటల ముందు తయారు చేస్తున్నారు. తద్వారా కన్ఫర్మ్ చేసిన సీట్లు పొందని వారు సకాలంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించవచ్చు. కానీ రైళ్లలో మరొక చార్ట్ తయారు అవుతుందని మీకు తెలుసా..? ఈ చార్ట్ ఎవరి కోసం తయారు చేస్తారు.. ఏ రైళ్లలో ఉపయోగిస్తారు? మీరు ఈ రైళ్లలో టిక్కెట్లు కూడా బుక్ చేసుకోగలరా? తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: School Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ఆ ప్రభుత్వం!

ఈ సందర్భంగా రైల్వే మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. అన్ని రైళ్లలో ఎనిమిది గంటల ముందుగానే చార్టులను తయారు చేయడం ప్రారంభించామని, అయితే ఈ చార్ట్ కాకుండా, రైలు బయలుదేరే అరగంట ముందు మాత్రమే మరొక చార్ట్ తయారు చేస్తామని చెప్పారు. దీని తరువాత తుది చార్ట్ జారీ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ చార్ట్ ఏ రైళ్ల కోసం తయారు చేస్తారు?

దిలీప్ కుమార్ ప్రకారం.. చివరి క్షణం వరకు సీట్లు ఖాళీగా ఉన్న రైళ్ల కోసం ఈ చార్ట్ తయారు చేయనున్నట్లు చెప్పారు. ఈ రైళ్లలో ప్రజలు రిజర్వేషన్లు చేసుకుంటారు. అరగంట ముందు వరకు రిజర్వేషన్లు చేసుకోవచ్చు. రిజర్వేషన్లు అరగంట ముందు మూసివేసినా చార్ట్ తయారు అవుతుంది. ఇవి ప్రీమియం రైళ్ల నుండి మెయిల్ ఎక్స్‌ప్రెస్ వరకు ఏదైనా రైలు కావచ్చు.

ఎవరు రిజర్వేషన్ చేసుకోవచ్చు:

ఈ రైళ్లలో ఎవరైనా రిజర్వేషన్లు చేసుకోవచ్చు. సీటు ఖాళీగా ఉంటే చాలు. సాధారణంగా ప్రజలు ఏ నగరానికి వెళ్లే ప్రధాన రైళ్లలోనైనా రిజర్వేషన్లు చేసుకుంటారు. కానీ వారు ఇతర రైళ్ల వైపు దృష్టి పెట్టరు. చాలా సార్లు ఈ రైళ్లలో సీట్లు చివరి వరకు ఖాళీగా ఉంటాయి. ఈ రైళ్లలో సీట్లు చివరి వరకు ఖాళీగా ఉంటాయి. తదనుగుణంగా అరగంట ముందుగానే చార్ట్ తయారు చేస్తారు.

జనరల్ క్లాస్ సీట్లు నిండిన తర్వాత కూడా ఇదే పద్ధతి:

రైళ్ల చార్ట్‌ను 8 గంటల ముందుగానే సిద్ధం చేయాలని సూచనలు జారీ చేసింది రైల్వే. కానీ తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ కోటాలో ఎటువంటి మార్పు చేయలేదు. ఈ విధంగా చార్ట్ సిద్ధం చేయబడి ఆ రైలులో తత్కాల్ కోటాలో సీట్లు ఖాళీగా ఉంటే అప్పుడు బుక్ చేసుకుని ప్రయాణించవచ్చు. అంతకుముందు కూడా చార్ట్ సిద్ధం చేసిన తర్వాత ఈ కోటాలో సీట్లు ఖాళీగా ఉంటే వాటిని బుక్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price: మగువలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే..

Railway Chart

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం