AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ బలంగా ఉంది.. దీర్ఘకాలిక పెట్టుబడులకు సమయం ఆసన్నమైందిః కేకి మిస్త్రీ

అమెరికా సుంకాల విధింపును నిలిపివేసిన తర్వాత చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచ మార్కెట్లలో రాబోయే మాంద్యం భయాల నుండి ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలోనే HDFC బ్యాంక్‌తో సహా అనేక ప్రముఖ సంస్థల కంపెనీలలో స్వతంత్ర డైరెక్టర్, బ్యాంకర్ కేకి మిస్త్రీ భారతీయ మార్కెట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత్ బలంగా ఉంది.. దీర్ఘకాలిక పెట్టుబడులకు సమయం ఆసన్నమైందిః కేకి మిస్త్రీ
Former Hdfc Head Keki Mistry
Balaraju Goud
|

Updated on: Apr 13, 2025 | 1:29 PM

Share

అమెరికా సుంకాల విధింపును నిలిపివేసిన తర్వాత చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచ మార్కెట్లలో రాబోయే మాంద్యం భయాల నుండి ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలోనే HDFC బ్యాంక్‌తో సహా అనేక ప్రముఖ సంస్థల కంపెనీలలో స్వతంత్ర డైరెక్టర్, బ్యాంకర్ కేకి మిస్త్రీ భారతీయ మార్కెట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా వాణిజ్య సుంకాలు భారతదేశానికి అనుకూలంగా నడిచే అవకాశాలను వివరించారు.

“నా అభిప్రాయం ప్రకారం, భారతీయ మార్కెట్లు చాలా బలంగా ఉన్నాయి. మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేకి మిస్త్రీ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా, ప్రస్తుతం సమయంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, స్వల్పకాలిక అస్థిరత ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం అని భావిస్తున్నాను” అని తెలిపారు. భారతదేశం ఇంకా పెద్ద ఎగుమతిదారుగా లేనందున, భారతదేశంపై వాణిజ్య సుంకాల నికర ప్రభావం పెద్దగా ఉండదని అన్నారు. ప్రతి సంవత్సరం కళాశాల క్యాంపస్‌ల నుండి కొత్తగా బయటకు వచ్చే యువతకు ఉద్యోగాలను సృష్టించడం కొనసాగించగలిగినంత కాలం, మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతూనే ఉంటుంది,”అని ఆయన అన్నారు. “మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పుడు ఎప్పుడూ అతిగా స్పందిస్తాయి” అని అన్నారు.

“మనం ఒంటరిగా కాకుండా సాపేక్ష ప్రాతిపదికన మనల్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉందని” కేకి మిస్త్రీ తెలిపారు. ప్రస్తుతానికి సుంకాలను వాయిదా వేసినప్పటికీ, భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (GDP)లో భాగం కావు” అని అన్నారు. అవి GDPలో 21 శాతం, దానిలోపు, మొత్తం ఎగుమతుల్లో అమెరికాకు 17 శాతం మాత్రమే ఉండటం వలన భారతదేశ GDPపై ప్రత్యక్ష ప్రభావం 40 నుండి 50 బేసిస్ పాయింట్లు ఉంటుందన్నారు. కానీ, చమురు ధరలు తగ్గుముఖం పట్టడం ద్వారా ఇది భర్తీ చేయడం జరుగుతుంది”. ఇది ఓదార్పు పొందేందుకు అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

అదనంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) వ్యవస్థలోకి ద్రవ్యతను నింపింది. ఇవన్నీ కలిపితే, “చమురు ధరలు పడిపోవడం 10 బేసిస్ పాయింట్లు సహాయపడుతుంది. లిక్విడిటీ ఇన్ఫ్యూషన్ GDPకి మరో 10 బేసిస్ పాయింట్లు జోడిస్తుంది. కాబట్టి, భారత GDPపై నికర ప్రభావం 25 నుండి 30 బేసిస్ పాయింట్ల కంటే ఎక్కువ ఉండదు.” అని కేకి మిస్త్రీ వివరించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!