Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDS-Deduction: TDS చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఆ ఖర్చులను దాచిపెడితే నోటీసులు రావచ్చు.. ఓ సారి చూసుకోండి..!

ఆర్థిక సంవత్సరం ముగిసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో (2021-22), చాలా పన్ను నియమాలు మార్చబడ్డాయి. ఇది కాకుండా, ఆదాయపు పన్ను శాఖ కూడా కఠినంగా మారింది. ఎవరైనా పన్ను ఎగవేసినట్లయితే, అతనికి డిపార్ట్మెంట్ నుండి నోటీసులు ..

TDS-Deduction: TDS చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఆ ఖర్చులను దాచిపెడితే నోటీసులు రావచ్చు.. ఓ సారి చూసుకోండి..!
26as Form
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 05, 2021 | 8:22 PM

2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో (2021-22), చాలా పన్ను నియమాలు మార్చబడ్డాయి. ఇది కాకుండా, ఆదాయపు పన్ను శాఖ కూడా కఠినంగా మారింది. ఎవరైనా పన్ను ఎగవేసినట్లయితే.. అతనికి డిపార్ట్మెంట్ నుండి నోటీసులు పంపండం మొదలవుతుంది. చాలా మంది పన్ను చెల్లింపుదారులకు తమ క్రెడిట్ కార్డుతో లక్షకు పైగా ఖర్చు చేసినప్పటికీ రిటర్నులు దాఖలు చేయనందున నోటీసులు జారీ అవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో ఏ తప్పులు జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం…

ఎకనామిక్ టైమ్స్ లో ప్రచురించిన నివేదిక ప్రకారం… చాలా మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఐటి విభాగం అలాంటి నోటీసు జారీ చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి TDS (Tax Deduction at Source)ను తగ్గించినా.. లేదా ఆర్థిక సంవత్సరంలో 1 లక్షకు పైగా క్రెడిట్ కార్డులను ఖర్చు చేసిన కాని రిటర్నులను దాఖలు చేయాలి. అయితే కొంతమంది పన్ను చెల్లింపుదారులకు వడ్డీ ఆదాయం తక్కువగా ఉన్నట్లు చూపిస్తుంటారు.

10 వేల వరకు ట్యాక్స్ ఫ్రీ..

10 వేల రూపాయల వరకు వడ్డీ ఆదాయం ఆర్థిక సంవత్సరంలో పన్ను రహితంగా ఉంటుంది. దాని కంటే ఎక్కువ ఆదాయం పన్ను విధించబడుతుంది. ఒక పన్ను చెల్లింపుదారుడు 10 వేలకు పైగా వడ్డీ ఆదాయాన్ని దాచిపెట్టినట్లయితే… అతనికి నోటీసు పంపిస్తారు అదికారులు. ఒక పన్ను చెల్లింపుదారుడు క్రెడిట్ కార్డు బిల్లులో 1 లక్ష కన్నా ఎక్కువ నగదును జమ చేస్తే..  ఆదాయపు పన్ను శాఖ కూడా అలాంటి లావాదేవీలపై నిఘా  పెడుతుంది. వాస్తవానికి మీ క్రెడిట్ కార్డ్ పాన్ కార్డుతో లింక్ చేయబడి ఉంటుంది. అలాంటి వారికి ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేస్తుంది.

మాస్ నోటీసు జారీ చేశారు

వాస్తవానికి ఆదాయపు పన్ను విభాగం కొత్త ఇంటెలిజెన్స్ వ్యవస్థను అమలు చేస్తోంది. ఈ వ్యవస్థ అటువంటి పన్ను చెల్లింపుదారులపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. మన దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 60 మిలియన్లకు పైగా ఉంది. అలాంటివారి వివరాలను దాచి పెడుతుంది. ఇలాంటివారికి ఒకే సారి పెద్ద ఎత్తున మాస్ నోటీసులను జారీ చేస్తుంది.

(26as form)ఫారం 26AS లో ..

జూలై 2020 లో ఆదాయపు పన్ను శాఖ INTRAC ను అమలులోకి తెచ్చింది. పన్ను చెల్లింపుదారులకు కొత్త 26AS ఫారంలో వారి ఆర్థిక లావాదేవీల గురించి అదనపు సమాచారాన్ని కలిగి ఉంటుంది. వివిధ రకాల ఆర్థిక లావాదేవీలలో పేర్కొనబడుతుంది. ఈ SFT ల నుండి ఆదాయపు పన్ను శాఖ అందుకున్న సమాచారం ఫారం 26AS లోని పార్ట్ E లో చూపబడుతోంది.

ఇవి కూడా చదవండి : Maoist Release a Letter: మావోయిస్టుల మరో ఎత్తుగడ.. మొన్న విధ్వంసం..నేడు మరో కొత్త ప్లాన్‌తో కేంద్రానికి లేఖ..

Earn 10 Crore by One Rupee: ఆ ఒక్క నాణెం మీ వద్ద ఉందా..! ఇంకేం మీరు కోటీశ్వరులైపోయినట్లే.. ఎలాగో తెలుసా..!