Maoist Release a Letter: మావోయిస్టుల మరో ఎత్తుగడ.. మొన్న విధ్వంసం..నేడు మరో కొత్త ప్లాన్‌తో కేంద్రానికి లేఖ..

మావోయిస్టులు మరో ఎత్తుగడతో ముందుకు సాగుతున్నారు. ఛత్తీస్‌గడ్ ఘాతుకం తర్వాత మరో ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారు. ఛత్తీస్‌గడ్ ఘటన తర్వాత తొలిసారి ఓ లేఖను విడుదల చేశారు. అందులో భారత్‌ బంద్‌కు..

Maoist Release a Letter: మావోయిస్టుల మరో ఎత్తుగడ.. మొన్న విధ్వంసం..నేడు మరో కొత్త ప్లాన్‌తో కేంద్రానికి లేఖ..
Maoist Weapons
Follow us

|

Updated on: Apr 05, 2021 | 6:06 PM

Chhattisgarh Maoist: మావోయిస్టులు మరో ఎత్తుగడతో ముందుకు సాగుతున్నారు. ఛత్తీస్‌గడ్ ఘాతుకం తర్వాత మరో ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారు. ఛత్తీస్‌గడ్ ఘటన తర్వాత తొలిసారి ఓ లేఖను విడుదల చేశారు. అందులో భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. సీపీఐ మావోయిస్టు సౌత్ సబ్ జోనల్ బ్యూరో పేరుతో లేఖను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.

ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 25 వరకు అన్ని ప్రజా ఉద్యమాలకు మద్దతుగా విప్లవాత్మక ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు లేఖలో వెల్లడిచారు. ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. వెంటనే ఆపరేషన్ ప్రహార్-3ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రహార్ ఆపరేషన్‌లో పాల్గొనవద్దని నక్సల్స్ పారా మిలటరీ, ఛత్తీస్‌గడ్ పోలీసులు, జవాన్లకు లేఖలో కోరారు.

పోలీస్ ఉద్యోగం మానేయాలని.. సమదాన్- ప్రమార్ ను ఓడించే ప్రజల ఉద్యమంలో చేరి తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని లేఖలో వెల్లడించారు. అంతే కాదు గ్రామాల్లో పోలీసులు ప్రజలను వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఇలాంటి పలు డిమాండ్లతో కూడా ఓ భారీ లెటర్‌ను మావోయిస్టులు మీడియాకు విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి : Tirupati by-election: సింబల్‌ విషయంలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధికి ఊహించని షాక్..! అసలు ఏం జరిగింది 

Why Fan Have Three Blades: మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా..! ఫ్యాన్‌కు మూడు రెక్కలే ఎందుకుంటాయో తెలుసా..!

ఇవి కూడా చదవండి : మీ ఇంట్లో బల్లి ఉందా..! బల్లిని చూస్తే భయపడుతున్నారా..! బయటకు పంపించే సులభమైన మార్గం ఇదే..!