AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: ఇల్లు కొన్న తర్వాత ఐటీ నోటీసు వచ్చిందా? ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచించారా?

ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేసిన తర్వాత మీకు ఆదాయపు పన్ను నోటీసు వచ్చినట్లయితే మీ పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేశారా లేదా తెలుసుకోవాలి. అలాగే, మీరు ఎవరి ఆస్తిని కొనుగోలు చేస్తున్నారో వారి పాన్ కార్డు కూడా ఆధార్‌తో లింక్ చేసి ఉండాలి. కొనుగోలుదారు లేదా విక్రేత పాన్ కార్డ్ అతని ఆధార్ నంబర్‌తో లింక్ చేయకపోతే, ఇద్దరూ ఇబ్బందుల్లో పడవచ్చు. ఇలాంటి సమస్య..

Income Tax: ఇల్లు కొన్న తర్వాత ఐటీ నోటీసు వచ్చిందా? ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచించారా?
Income Tax
Follow us
Subhash Goud

|

Updated on: Dec 09, 2023 | 8:23 PM

ప్రతి ఒక్కరూ ఆస్తిలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. ఇందులో ఆలస్యంగానైనా రాబడులు వస్తుంటాయి. మీ పెట్టుబడి కూడా సురక్షితంగా ఉంటుంది. కానీ, ఈ రోజుల్లో ప్రజలు ఆస్తి కొనుగోలుపై ఆదాయపు పన్ను నోటీసును ఎదుర్కొంటున్నారు. మీకు కూడా అలాంటిదే జరిగితే అక్కడ ఎలాంటి తప్పు జరిగిందో తెలుసుకోవాలి.

పాన్‌; ఆధార్ లింక్ చేయడం చాలా ముఖ్యం:

ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేసిన తర్వాత మీకు ఆదాయపు పన్ను నోటీసు వచ్చినట్లయితే మీ పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేశారా లేదా తెలుసుకోవాలి. అలాగే, మీరు ఎవరి ఆస్తిని కొనుగోలు చేస్తున్నారో వారి పాన్ కార్డు కూడా ఆధార్‌తో లింక్ చేసి ఉండాలి. కొనుగోలుదారు లేదా విక్రేత పాన్ కార్డ్ అతని ఆధార్ నంబర్‌తో లింక్ చేయకపోతే, ఇద్దరూ ఇబ్బందుల్లో పడవచ్చు. ఇలాంటి సమస్య కారణంగా ఇటీవల కోటికి పైగా పాన్ కార్డులు మూతపడ్డాయి.

ఇవి కూడా చదవండి

పన్ను ఎంత ?

ఆస్తి కొనుగోలు, విక్రయాలపై ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. రూ. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తి కొనుగోలుపై 1 శాతం టీడీఎస్‌ చెల్లించాలి. అయితే దానిని తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆధార్-పాన్ లింక్ చేయడానికి గడువు ముగిసింది. అటువంటి పరిస్థితిలో ప్రజలు 20 శాతం TDS చెల్లించాలి. ఆధార్-పాన్ లింక్ చేయడానికి చివరి తేదీ నుండి 6 నెలలకు పైగా గడిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆస్తులు కొనుగోలు చేసిన వ్యక్తులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపుతోంది. వీటిలో 20 శాతం టీడీఎస్‌ను ప్రజల నుంచి డిమాండ్‌ చేశారు. ఇలా వందల సంఖ్యలో ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.

కోటికి పైగా పాన్ కార్డులు డీయాక్టివేట్‌:

ఇటీవల కోటికి పైగా పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి. వీరంతా తమ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయలేదు. డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు కార్డులను లింక్ చేయడం వల్ల ప్రభుత్వం ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచడం సులభం అవుతుంది. అందువల్ల మీరు భవిష్యత్తులో ఎక్కడైనా ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ స్వంతం మాత్రమే కాకుండా ఇతరుల పాన్, ఆధార్ కార్డ్ గురించిన సమాచారాన్ని సేకరించాలని నిర్ధారించుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి