
పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. కుటుంబాలుగా టూర్లు వెళ్లడానికి ఇదే సరైన సమయం. సాధారణంగా మన ఇళ్లల్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు లేదా కుటుంబాలుగా లాంగ్ టూర్లకు వెళ్తున్నప్పుడు బస్సులు, ప్రైవేటు కార్లు బుక్ చేసుకోవడం మనకు తెలుసు. కానీ ఓ రైలు బండినే బుక్ చేసుకోవచ్చని మీకు తెలుసా? అవునండి నిజమే మీరు పెద్ద గ్రూప్ గా ఎక్కడికైనా టూర్ వెళ్లాలనుకున్నప్పుడు ఏకంగా రైలు బండి లేదా ఓ రైలు బోగిని బుక్ చేసుకోవచ్చు. ఒకే కుటుంబానికి చెందినవారు లేదా విద్యా సంస్థకు చెందినవారు లేదా ఒక బృందంగా టూర్ వెళ్తున్నవారు రైలులో ఒక బోగీని తమకు బుక్ చేసుకోవచ్చు. సాధారణ బుకింగ్ ద్వారా అందరు రైలులో టికెట్స్ బుక్ చేస్తే వేర్వేరు బోగీల్లో బెర్తులు కన్ఫామ్ అవుతాయి. అలా కాకుండా ఒక బోగీ బుక్ చేసుకుంటే అందరూ ఆ కోచ్లోనే ప్రయాణించవచ్చు. ఇలా ఒక కోచ్ మాత్రమే కాదు అవసరమైతే రైలు మొత్తాన్ని కూడా బుక్ చేసుకోవచ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ఒక కోచ్ మొత్తాన్ని బుక్ చేయాలంటే రూ.50,000 సెక్యూరిటీ పేమెంట్ చేయాలి. ఒకవేళ 18 కోచ్లు ఉన్న రైలు మొత్తాన్ని బుక్ చేయాలంటే రూ.9 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. గ్రూప్ టూర్ ప్లాన్ చేసేవారు ప్రయాణానికి 30 రోజుల నుంచి 6 నెలల ముందే కోచ్ లేదా రైలు బుక్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం