AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: సీతమ్మ పద్దుపై అంకుర పరిశ్రమల కోటి ఆశలు.. మరి ఫలిస్తాయా?

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆఖరి బడ్జెట్‌ కావడంతో అందిర దృష్టి దీనిపైనే ఉంది. అన్ని రంగాల వరకూ ఆశావహ దృక్పథంతో బడ్జెట్‌ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో పలు స్టార్టప్‌(అంకుర పరిశ్రమలు)లు కూడా కొన్ని అంశాలలో తమకు మేలు జరుగుతుందన్న ఆశలో ఉన్నాయి. అటువంటి కొన్ని స్టార్టప్‌ల అధిపతులు, వాటిల్లో పెట్టుబడిదారులు పెడుతున్న కొందరూ బడ్జెట్‌పై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Budget 2024: సీతమ్మ పద్దుపై అంకుర పరిశ్రమల కోటి ఆశలు.. మరి ఫలిస్తాయా?
Budget 2024
Madhu
|

Updated on: Jan 31, 2024 | 8:47 AM

Share

కేంద్ర బడ్జెట్‌ 2024కు సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25కు సంబంధించిన మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆఖరి బడ్జెట్‌ కావడంతో అందిర దృష్టి దీనిపైనే ఉంది. అన్ని రంగాల వరకూ ఆశావహ దృక్పథంతో బడ్జెట్‌ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో పలు స్టార్టప్‌(అంకుర పరిశ్రమలు)లు కూడా కొన్ని అంశాలలో తమకు మేలు జరుగుతుందన్న ఆశలో ఉన్నాయి. అటువంటి కొన్ని స్టార్టప్‌ల అధిపతులు, వాటిల్లో పెట్టుబడిదారులు పెడుతున్న కొందరూ బడ్జెట్‌పై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • 35 నార్త్‌ వెంచర్స్‌ వ్యవస్థాపకుడు, ఎండీ మిలన్ శర్మ మాట్లాడుతూ మన దేశంలోని స్టార్టప్‌లు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేందుకు ప్రాథమిక ఆర్‌ అండ్‌ డీ నిధుల కోసం క్రమబద్ధమైన నిబంధనలు, ప్రభుత్వ మద్దతు అవసరమన్నారు. పెట్టుబడిదారుల కోసం, అన్‌లిస్టెడ్ ఈక్విటీలపై మెరుగైన పన్నుల అమరిక మెరుగైన మూలధన ప్రవాహాన్ని అనుమతిస్తుందని ఆదిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బావుంటుదన్నారు.
  • హర్‌కీ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ ఓనేహా బగారియా మాట్లాడుతూ భారతదేశం వార్షిక బడ్జెట్ కోసం సన్నద్ధమవుతున్నందున, భవిష్యత్తు అవసరాల నేపథ్యంలో మహిళలల్లో నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. ప్రభుత్వం, కార్పొరేట్ ఇండియా సంయుక్తంగా ఈ ప్రయత్నం చేస్తే.. ఈ మహిళల శిక్షణలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులకు మార్గం సుగమం చేస్తుంది. స్థితిస్థాపకంగా, విభిన్నమైన శ్రామికశక్తిని పెంపొందించడానికి ఇది దోహదపడుతుంది. ఈ నైపుణ్యాల అభివృద్ధి డైనమిక్ జాబ్ మార్కెట్‌కు మూలస్తంభంగా మారుతుంది. కెరీర్ పరంగా మహిళలకు అవకాశాలను సృష్టిస్తుంది.
  • యెతీ కన్సల్టెన్సీ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ శ్రీరంగ్ శ్రీకాంత మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు పౌరులకు వేగంగా చేరడంతో పాటు సమస్యల పరిష్కారం వేగంగా జరగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉదాహరణకు ఆధార్, యూపీఐ సేవలను మరింత ముందుకు వేయాల్సిన అవసరం ఉందన్నారు. పౌర-కేంద్రీకృత సేవలను డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పరిధిలోకి తీసుకురావాల్సిన సమయం వచ్చిందన్నారు. మొత్తం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) అంతటా అప్లికేషన్‌ల బిల్డ్, టెస్ట్, ధ్రువీకరణ, అప్‌టైమ్ చుట్టూ పటిష్టత, అప్లికేషన్ విశ్వసనీయత, జవాబుదారీతనాన్ని నిర్ధారించే సమగ్ర డిజిటల్ వ్యూహం అవసరమని కోరుతున్నారు.
  • ఎక్స్‌వైఎక్స్‌ఎక్స్‌ అపెరల్స్ ఫౌండర్‌ యోగేష్ కాబ్రా మాట్లాడుతూ మన దేశం స్టార్టప్‌ లకు నూతన ఆవిష్కరణ ప్రపంచ కేంద్రంగా మారడానికి సిద్ధంగా ఉందన్నారు. అందుకు ప్రభుత్వం నుంచి కొత్త ప్రోత్సాహం అవసరమని భావిస్తున్నట్లు చెప్పారు. ఆ దిశగా చర్యలుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పన్ను నిర్మాణాలు, అనుకూలీకరించిన మద్దతు కార్యక్రమాలు, మూలధనానికి సులభమైన, సరళీకృత ప్రాప్యత, ఆవిష్కరణలకు ప్రోత్సాహకాలు ఉంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే నైపుణ్యం కలిగిన కార్మికులకు కొనసాగుతున్న శిక్షణ, అప్‌గ్రేడేషన్, ముఖ్యంగా తయారీ, రిటైల్ రంగాలలో, మరింత పటిష్టంగా నిర్మించడానికి భారీ ప్రోత్సాహం అవసరమని చెబుతున్నారు.