AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST on Packaged Foods: ప్యాకేజీ వస్తువులు, ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ విధించడానికి కారణం ఏమిటి..?

GST on Packaged Foods: ప్యాకేజ్డ్ వస్తువులు, ఆహార ఉత్పత్తులపై వస్తు సేవల పన్ను విధింపు నిర్ణయాన్ని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ సమర్థించారు. ఈ ఉత్పత్తులపై పన్ను ఎగవేత జరుగుతోందని..

GST on Packaged Foods: ప్యాకేజీ వస్తువులు, ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ విధించడానికి కారణం ఏమిటి..?
Subhash Goud
|

Updated on: Jul 25, 2022 | 11:41 AM

Share

GST on Packaged Foods: ప్యాకేజ్డ్ వస్తువులు, ఆహార ఉత్పత్తులపై వస్తు సేవల పన్ను విధింపు నిర్ణయాన్ని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ సమర్థించారు. ఈ ఉత్పత్తులపై పన్ను ఎగవేత జరుగుతోందని, దీని కోసమే జీఎస్టీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ముందుగా ప్యాక్ చేసిన తృణధాన్యాలు, పప్పులు, ఆటా, మజ్జిగ, పెరుగు పనీర్‌లపై 5% GST విధించాలని ఇటీవల నిర్ణయించారు. ఇంతకు ముందు ఈ వస్తువులన్ని జీఎస్టీ పరిధిలోకి వచ్చేవి. ఇటీవల చండీగఢ్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై జీఎస్టీ విధించాలని నిర్ణయించారు. ఈ రేట్లు జూలై 18 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పెంపును ఉపసంహరించుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు.

జులై 18 నుంచి ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్‌పై జీఎస్‌టి విధించాలన్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిది కాదని, జీఎస్టీ కౌన్సిల్‌దేనని బజాజ్ పేర్కొంది. కేంద్రంతో పాటు రాష్ట్రాల అధికారులతో కూడిన జీఎస్టీ రేట్లను సూచించే ఫిట్‌మెంట్ కమిటీ ఈ విషయంలో నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రాల మంత్రుల భాగస్వామ్యంతో మంత్రుల బృందం (GoM) కూడా ఈ ఉత్పత్తులపై GST విధించాలని సిఫార్సు చేసిందని, దీనికి GST కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపిందన్నారు. దీని ఆధారంగా జూలై 18 నుంచి ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్‌పై ఐదు శాతం చొప్పున జీఎస్టీని అమల్లోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. అయితే, ప్రతిపక్షాలు, ఇతర సంఘాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని, ఇది సామాన్యులకు ఇబ్బందికరమని పేర్కొందని తెలిపారు.

జీఎస్టీ కౌన్సిల్‌ సమ్మతితో ఈ నిర్ణయం:

ఇవి కూడా చదవండి

జీఎస్టీ కౌన్సిల్‌ సమ్మతితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్యదర్శి బజాజ్‌ తెలిపారు. జీఎస్టీకి సంబంధించిన విషయాలను నిర్ణయించే అత్యున్నత సంస్థ జీఎస్టీ కౌన్సిల్ అని, ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై పన్ను విధించడంపై ఈ కమిటీ ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకుందని చెప్పారు. జీఎస్టీ కమిటీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు కూడా ఉంటారు. అయితే, పప్పులు, గోధుమలు, బియ్యం, బార్లీ, మొక్కజొన్న, గోధుమ పిండి, సెమోలినా, శెనగపిండి, ముర్మురా, పెరుగు, లస్సీలను బహిరంగంగా విక్రయించే, ప్యాక్ లేదా లేబుల్ లేకుండా విక్రయించే వాటిపై ఎటువంటి GST వర్తించదన్నారు. జీఎస్‌టి అమలుకు ముందు ఈ నిత్యావసర వస్తువులపై అనేక రాష్ట్రాల్లో పన్ను విధించబడింది. వాటి ద్వారా రాష్ట్రాలకు ఆదాయం వచ్చేది. జూలై 2017లో ప్రవేశపెట్టిన GST విధానంతో ఈ పద్ధతిని కొనసాగించాలని భావించారు. అయితే నిబంధనలు, సర్క్యులర్‌లు బయటకు రాగానే బ్రాండెడ్ ఉత్పత్తులపై ఈ పన్ను విధించినట్లు చెప్పారు. పెద్ద బ్రాండ్‌లు ఈ నిబంధనను సద్వినియోగం చేసుకుంటున్నాయి అని అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి