AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్య బాలరాముడిదే 1st ప్లేస్.. 2వ స్థానంలో తాజ్ మహల్

అయోధ్య బాలరాముడిదే 1st ప్లేస్.. 2వ స్థానంలో తాజ్ మహల్

Phani CH
|

Updated on: Dec 24, 2024 | 3:05 PM

Share

అయోధ్య రామమందిరం.. ఈ ఏడాది జనవరిలో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. 2024 జనవరి 22న ప్రధాని నరేంద్రమోదీ ఆలయాన్ని ప్రారంభించారు. నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు, సందర్శకులు అయోధ్యకు క్యూ కడుతున్నారు. దేశ విదేశాల నుంచి విచ్చేస్తున్న భక్తులతో అయోధ్య ప్రతినిత్యం రద్దీగా మారింది. అయోధ్య రామమందిరం ఇప్పుడు మరో సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది.

ఆ అందాల బాలరాముడి ముందు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తాజ్‌మహల్‌ కూడా చిన్నబోయిందా అనిపించేలా అందిరి దృష్టినీ ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య రామమందిరం సరికొత్త పర్యాటక రికార్డులను సృష్టించింది. దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య నిలిచింది. ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్ మహల్.. భారత్‌లోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా ఉండగా.. ఇప్పుడు ఆ స్థానాన్ని అయోధ్య భర్తీ చేసింది. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. 2024 జనవరి నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో 47.61 కోట్ల మంది పర్యాటకులు ఉత్తరప్రదేశ్‌ను సందర్శించారని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర పర్యాటక పరిశ్రమ కొత్త మైలురాళ్లను నెలకొల్పింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వార్నీ !! ఒకే ఒక్క కారణంతో.. రూ.కోటి జీతాన్ని వదిలేసుకున్నాడు !!

చిరంజీవితో సినిమా చేయాలని తీవ్రంగా ప్రయత్నించా.. కానీ..

క్లిష్ట పరిస్థితుల్లో తమన్ సాయం చేశాడు.. కానీ నేనే..

TOP 9 ET News: శంకర్ ప్రభాస్‌ను మరో రేంజ్‌లో ఊహించాడా ??

గేమ్‌ ఛేంజర్‌ ఫస్ట్ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో గూస్ బంప్స్ గ్యారంటీ