AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold and Silver Prices Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే

2024 చివరి త్రైమాసికంలో పసిడి ధర కొంచెం తగ్గుముఖం పట్టేసరికి భారీ డిమాండ్ ఏర్పడింది. దేశంలో బంగారం ధర ఈ రోజు (గురువారం సెప్టెంబర్ 12 వ తేదీన) స్వల్పంగా పెరిగాయి. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో సహా దేశంలో ప్రధాన నగరాల్లో ఈ రోజు ఉన్న బంగారం, వెండి ధరల గురించి తెలుసుకుందాం..

Gold and Silver Prices Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే
Gold Silver Price Today
Surya Kala
|

Updated on: Sep 12, 2024 | 6:40 AM

Share

గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగడం లేదు. బంగారం, వెండి లోహాల ధరలు హెచ్చు తగ్గులు ఏర్పడుతున్నాయి. అయితే 2024 చివరి త్రైమాసికంలో పసిడి ధర కొంచెం తగ్గుముఖం పట్టేసరికి భారీ డిమాండ్ ఏర్పడింది. దేశంలో బంగారం ధర ఈ రోజు (గురువారం సెప్టెంబర్ 12 వ తేదీన) స్వల్పంగా పెరిగాయి. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో సహా దేశంలో ప్రధాన నగరాల్లో ఈ రోజు ఉన్న బంగారం, వెండి ధరల గురించి తెలుసుకుందాం..

తెలుగు ప్రధాన రాష్ట్రాల్లో బంగారం ధర

హైదరాబాద్​లో ఈ రోజు (గురువారం సెప్టెంబర్ 12 వ తేదీన) 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 10 పెరిగి ధర రూ. 67,160కి చేరింది. ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ (10గ్రాములు) రూ. 10 పెరిగి ధర రూ. 73,260గా నమోదైంది. ఇవే ధరలు ఆంద్రప్రదేశ్ ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో కూడా కొనసాగుతున్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధర

  1. దేశ రాజధాని డిల్లీలో ఈ రోజు 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 67,310లు ఉంది. మరోవైపు 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,410గా ఉంది.
  2. చెన్నైలో గురువారం సెప్టెంబర్ 12 వ తేదీన 22 క్యారెట్ల పసిడి (10గ్రాముల) ధర రూ. 67,160గా ఉంది. 10గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10గ్రాముల ధర రూ. 73,260గా ఉంది.
  3. బెంగళూరులో ఈ రోజు బంగారం ధరలు 22 క్యారెట్ల గోల్డ్​10గ్రాముల ధర రూ. 67,160గాను.. 24 క్యారెట్ల పసిడి 10గ్రాముల రూ. 73,260గాను ఉంది.
  4. కోల్​కతాలో ఈ రోజు 22 క్యారెట్ల పసిడి 10గ్రాముల ధర రూ. 67,160లకు చేరుకుంది. 24 క్యారెట్ల గోల్డ్​10గ్రాముల ధర. రూ. 73,260గా ఉంది. ఇవే ధరలు దేశ ఆర్ధిక రాజధాని ముంబై, పసిడికి నిలయమైన కేరళలోనూ కొనసాగుతున్నాయి.
  5. అయితే ఈ ధరల్లో మార్పులు ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాల ఆధారంగా హెచ్చుతగ్గులు ఉంటాయని మార్కెటింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.

దేశంలో వెండి ధరలు

కిలో లక్ష మార్క్ ను చేరుకున్న వెండి ధర దిగి వచ్చినట్లే దిగి వస్తూ మళ్ళీ పెరుగుతోంది. దేశంలో గురువారం సెప్టెంబర్ 12 వ తేదీన మళ్లీ స్వల్పంగా పెరిగాయి. బుధవారం కిలో వెండి ధర రూ. 86,500లు ఉండగా ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 86,600గా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 91,600 పలుకుతోంది. ఇదే ధర విజయవాడ, విశాఖలోనూ కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..