
Fuel Price: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్,డీజిల్ ధరలతో వాహనదారులు సతమతమవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో మంగళవారం వితంతువులు, నిరుపేదల సంక్షేమం కోసం పెట్రోల్, డీజిల్పై సెస్ పన్ను విధించారు. వితంతువులకు, నిరుపేదలకు సహాయపడేందుకు పెట్రోల్, హై-స్పీడ్ డీజిల్పై లీటరుకు 60 పైసల సెస్ విధించడానికి హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
దీని తరువాత ఈ పన్ను ఆగస్టు 11వ తేదీ అర్ధరాత్రి నుండి అమల్లోకి వస్తుందని హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు, 2026ను శాసనసభలో ఆమోదించింది. ఈ సవరించిన చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి గరిష్టంగా రూ. 5 పన్ను విధించే అధికారాన్ని కల్పిస్తుంది. దీనిని వితంతువులు, నిరుపేదల సంక్షేమం కోసం సెస్ విధించడానికి ఉపయోగించారు. ఈ పెట్రోల్, డీజిల్పై వితంతువుల, అనాథల సెస్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: School Holidays: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్న్యూస్.. మరోసారి వరుస సెలవులు!
బీజేపీ సీనియర్ నాయకుడు, హిమాచల్ ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జైరామ్ ఠాకూర్ కాంగ్రెస్ ప్రభుత్వ చర్యను వ్యతిరేకించారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడానికి చర్యలు తీసుకుంటోందని, వితంతువులు, నిరుపేదలపై పన్నులు విధించి ఆదాయం సంపాదించడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పన్నును పునఃపరిశీలించాలని కోరారు.
ఒకవైపు ప్రధానమంత్రి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు హిమాచల్ ప్రభుత్వం ఆ ధరలను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: DMart Offers: ఇక పండగే.. పండగ.. డీమార్ట్లో 80 శాతం వరకు డిస్కౌంట్లు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి