AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric cars: 2024లో ఎలక్ట్రిక్ కిక్.. కార్ల మార్కెట్‌ను ఊపేసిన అమ్మకాలు

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ విభాగంలోని స్కూటర్లు, బైక్ లు, కార్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న పెట్రోలు ధరల నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఇదే కావడంతో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వం ప్రోత్సాహం తదితర కారణాలు కూడా దీని వెనుక ఉన్నాయి. మన దేశంలో ఎక్కడా చూసినా ఈవీలు పరుగులు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలలో 2024 చివరి నాటికి 20 శాతం పెరుగుదల నమోదైంది.

Electric cars: 2024లో ఎలక్ట్రిక్ కిక్.. కార్ల మార్కెట్‌ను ఊపేసిన అమ్మకాలు
Ev Cars
Nikhil
|

Updated on: Jan 08, 2025 | 4:30 PM

Share

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడీఏ) వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గతేడాది 40.7 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి. వాటిలో ఎలక్ట్రిక్ కార్ల వాటా 2.4 శాతంగా ఉంది. వీటి వాటా 2023లో 2.1 శాతం మాత్రమే కావడం విశేషం. ఈ లెక్కల ప్రకారం గణనీయమైన పురోగతి లేనప్పటికీ ఆ మాత్రం పెరగడం విశేషమనే చెప్పవచ్చు. ఎందుకంటే గతేడాది ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. పలు ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిపోయాయి. ఓ ప్రముఖ కంపెనీ వాహనాలతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కస్టమర్లు తమ బాధలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు.

ఈ ఘటనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ సవాళ్లను ఈవీ మార్కెట్ అధిగమించిందనే చెప్పవచ్చు. ఒకటి, రెండు వాహనాల విషయంలో ఇబ్బందులు ఎదురైనా మిగిలిన వాహనాలు కస్టమర్ల ఆదరణ పొందాయి. తద్వారా ఈ విభాగంలో వాహనాల అమ్మకాలు బాగున్నాయి. టాటా మోటార్స్ 2024లో 61,496 యూనిట్లను ఈవీలను విక్రయించి మార్కెట్ లో అగ్రగామిగా నిలిచింది. టాటా టియాగో హచ్, టిగోర్ సెడాన్, పంచ్ మినీ ఎస్ యూవీ, నెక్సాన్, కర్వ్ ఎస్ యూవీలను కలిగి ఉన్న ఐసీఈ మోడళ్ల ఎలక్ట్రిక్ వెర్షన్లను విక్రయిస్తోంది. కొత్త ఏడాదిలో మరిన్ని మోడళ్లకు విడుదల చేయనుంది.

జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటారు రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ కంపెనీ 2024లో దాదాపు 125 శాతం ప్రగతిని సాధించింది. 2023లో 9,526 యూనిట్లను విక్రయించగా, 2024లో వాటి సంఖ్య 21,484కు పెరిగింది. బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్, బ్యాటరీ రెంటల్ మోడల్ తో వచ్చిన విండర్స్ ఎస్ యూవీకి కస్టమర్ల ఆదరణ లభించింది. ప్రముఖ కంపెనీలైన మారుతీ సుజుకి, హ్యుందాయ్ నుంచి 2025లో కొత్త మోడళ్లు విడుదల కానున్నట్టు సమాచారం. వాటి ద్వారా మార్కెట్ లో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని ఆ కంపెనీలు భావిస్తున్నాయి. మారుతీ ఇవిటా, హ్యుందాయ్ నుంచి క్రెట్ ఎస్ యూవీ ఎలక్ట్రిక్ కార్లు విడుదల కానున్నాయి. మహింద్రా అండ్ మహింద్రా కూడా తన బీఈ6, ఎక్స్ ఈవీ 9ఈ కార్లను ఆవిష్కరించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..