Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JIO 5G: దీపావళి నుంచి జియో 5జీ సేవలు.. మొదటగా ఆ పట్టణాల్లోనే.. ప్రకంటించిన ముఖేష్ అంబానీ..

JIO 5G: భారత టెలికాం చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. దీపావళి పర్వదినం నుంచే.. సరికొత్త నెట్‌వర్క్ వెలుగులు జిగేల్ మననున్నాయి.

JIO 5G: దీపావళి నుంచి జియో 5జీ సేవలు.. మొదటగా ఆ పట్టణాల్లోనే.. ప్రకంటించిన ముఖేష్ అంబానీ..
Mukesh Ambani
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 29, 2022 | 2:53 PM

JIO 5G: భారత టెలికాం చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. దీపావళి పర్వదినం నుంచే.. సరికొత్త నెట్‌వర్క్ వెలుగులు జిగేల్ మననున్నాయి. దీపావళి నుంచి దేశంలో రిలయన్స్ జియో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ ముఖేష్ అంబానీ ప్రకటించారు. 45వ AGM సందర్భంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ ఈ ప్రకటన చేశారు. ముందుగా ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 2023 డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా 5G అందుబాటులోకి వస్తుందని ముఖేశ్‌ అంబానీ ప్రకటించారు. ఎటువంటి వైర్లు లేకుండా అందించే ఈ సేవలను జియో ఎయిర్‌ ఫైబర్‌గా నామకరణం చేసినట్టు జియో చైర్మన్‌ ఆకాశ్ అంబానీ తెలిపారు.

కాగా, దేశ వ్యాప్తంగా 5G నెట్‌వర్క్‌ అందుబాటులోకి తెచ్చేందుకు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నామని రిలయన్స్ సంస్థ ప్రకటించింది. దేశంలో మొట్టమొదటిసారిగా వర్చువల్‌ రియాల్టీ విధానంలో ఈ AGM నిర్వహించారు. 5G సేవలందించేందుకు మెటా, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌తో భాగస్వామ్యాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కుదుర్చుకుంది.