AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2026: రీల్స్‌ ఎలా చేయాలో ఇక స్కూల్స్‌లోనే నేర్పిస్తారు! కేంద్ర ప్రభుత్వ కొత్త ప్రణాళిక

కేంద్ర ప్రభుత్వం డిజిటల్ యుగంలో యువతకు 20 లక్షల సోషల్ మీడియా ఉద్యోగాల లక్ష్యంతో కొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినట్లుగా, 2030 నాటికి దేశంలోని 15,000 పాఠశాలలు, 500 కళాశాలల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ప్రారంభమవుతాయి.

Budget 2026: రీల్స్‌ ఎలా చేయాలో ఇక స్కూల్స్‌లోనే నేర్పిస్తారు! కేంద్ర ప్రభుత్వ కొత్త ప్రణాళిక
Content Creator Labs Budget
SN Pasha
|

Updated on: Feb 01, 2026 | 3:25 PM

Share

డిజిటల్ యుగంలో దేశ యువతకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఉపాధి అవకాశాలను తెరిచింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఒక కీలక ప్రకటన చేశారు. 2030 నాటికి భారతదేశానికి దాదాపు 20 లక్షల మంది సోషల్ మీడియా నిపుణులు అవసరం అవుతారు. పెరుగుతున్న ఈ సంఖ్య, ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు పాఠశాలలు, కళాశాలలలో కంటెంట్ క్రియేటర్స్‌ ల్యాబ్స్‌ ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీని ద్వారా పాఠశాలలు, కళాశాలల నుండే విద్యార్థులకు కంటెంట్ క్రియేషన్‌పై శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రభుత్వం కొత్త ప్రణాళిక

సోషల్ మీడియాను ఇప్పుడు కేవలం వినోద సాధనంగా కాకుండా చాలా మంది ఒక కెరీర్‌గా చూస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. దీని ప్రకారం దేశంలోని 15,000 మాధ్యమిక పాఠశాలల్లో ఇప్పుడు ప్రత్యేక కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాలలతో పాటు దేశంలోని 500 ప్రముఖ కళాశాలల్లో ఇలాంటి అత్యాధునిక ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రయోగశాలలన్నింటి పని, నిర్వహణను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ (IICT) నిర్వహిస్తుంది. ఈ చొరవకు ప్రభుత్వం నేరుగా నిధులు సమకూరుస్తుంది.

విద్యార్థులు ఏం నేర్చుకుంటారు?

కంటెంట్‌ క్రియేషన్‌ అంటే కేవలం వీడియోలు, రీల్స్‌ గురించే కాదు సాంకేతిక అంశాలు కూడా నేర్పుతారు. ఈ ల్యాబ్స్‌లో విద్యార్థులకు ఈ క్రింది వాటిలో ఆచరణాత్మక శిక్షణ ఇవ్వనున్నారు.

  • వీడియో ఎడిటింగ్, పాడ్‌కాస్టింగ్
  • గ్రాఫిక్ డిజైన్, స్క్రిప్ట్ రైటింగ్
  • డేటా అనలిటిక్స్
  • డిజిటల్ మార్కెటింగ్, మానిటైజేషన్
  • రూల్స్‌ అండ్‌ ఎతిక్స్‌

కంటెంట్ హబ్‌గా మార్చడమే లక్ష్యం

ఆర్థిక మంత్రి ప్రకారం భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా మార్కెట్లలో ఒకటి. ఈ పథకం గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు ఇంటి నుండి ఆదాయం సంపాదించడానికి, పెద్ద బ్రాండ్‌లతో పనిచేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ విద్యతో పాటు, డిజిటల్ నైపుణ్యాలను పొందడం నిరుద్యోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే భారతదేశం ప్రపంచ స్థాయిలో కంటెంట్ హబ్‌గా మారుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి