AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deceased Client : మరణించిన ఖాతాదారుడి ఖాతాను కంటిన్యూ చేయొచ్చా..! లేదా మూసివేయాలా.. ఆర్బీఐ ఏం చెబుతుంది..

Deceased Client : కరోనా మహమ్మారి మన ప్రపంచాన్ని మార్చివేసింది. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన కుటుంబాలు మన

Deceased Client : మరణించిన ఖాతాదారుడి ఖాతాను కంటిన్యూ చేయొచ్చా..! లేదా మూసివేయాలా.. ఆర్బీఐ ఏం చెబుతుంది..
Deceased Client
uppula Raju
|

Updated on: Jun 14, 2021 | 1:45 PM

Share

Deceased Client : కరోనా మహమ్మారి మన ప్రపంచాన్ని మార్చివేసింది. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన కుటుంబాలు మన చుట్టూ ఉన్నాయి. కరోనా కారణంగా చాలా కుటుంబాల్లో మరణాలు సంభవించాయి. బీమా దావా, పెన్షన్, విపత్తు ఉపశమనం వంటి అంశాలపై చాలా అరుదుగా చర్చించేవారు కానీ ఇప్పుడు అలాంటి చర్చలు ప్రతిరోజూ జరుగుతున్నాయి. దాదాపుగా ఇది అనివార్యమైంది. కుటుంబ సభ్యుడు మరణిస్తే షాక్ నుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుంది. కానీ ఈ దు:ఖ సమయం ఎదుర్కొన్న తర్వాత కూడా కొంత పని అవసరం. ఒక కుటుంబ సభ్యుడు మరణించిన తరువాత, వీలైనంత త్వరగా వారి బ్యాంక్ ఖాతా మూసివేయబడాలా? లేదా అనేది తెలుసుకుందాం.

బ్యాంకు ఖాతాను మూసివేయడానికి తొందరపడకండి బ్యాంకు ఖాతాను మూసివేయడానికి తొందరపడవద్దు. ఎందుకంటే ఇందులో కుటుంబ పెన్షన్, డివిడెండ్, వడ్డీ వంటి ఆదాయం ఉంటుంది. ఇది కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఈ ఖాతాను మూసివేసి కొత్త ఖాతా తెరవడం కంటే దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ ఖాతాను ఎస్టేట్ ఖాతాగా మార్చడం మంచిది. దీనిని ‘ఎస్టేట్ ఆఫ్ మిస్టర్ లేదా మిసెస్ (ఎవరు మరణించారు)’ గా పరిగణిస్తారు. ఇందులో డబ్బులావాదేవీలు కూడా చేసుకోవచ్చు. మీరు ఖాతాను మూసివేసే ఇబ్బందిని కూడా తప్పించుకుంటారు.

మీరు బ్యాంక్ ఖాతాను మూసివేయాలనుకుంటే ఏమి చేయాలి? మీరు బ్యాంక్ ఖాతాను మూసివేయాలనుకుంటే మరణించిన వ్యక్తి నోటరైజ్డ్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి. డెత్ సర్టిఫికేట్ను స్థానిక మునిసిపల్ బాడీలో సులభంగా తయారు చేయవచ్చు. నామినీ ఉంటే అప్పుడు అతను మొత్తం డబ్బును పొందుతాడు. నామినీ లేకపోతే వారసుడిగా ఉన్న కుటుంబ సభ్యుడు తనకు మరణించిన వ్యక్తికి మధ్య ఉన్న సంబంధించిన పత్రాలను మరణ ధృవీకరణ పత్రంతో పాటు బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. నష్టపరిహార బాండ్‌ను కూడా బ్యాంకు అడగవచ్చు.

ఆర్‌బిఐ ఆదేశం ఏమిటి? ఇలాంటి విషయాల్లో మృదువైన వైఖరిని ఉంచాలని ఆర్‌బిఐ బ్యాంకులను కోరింది. కుటుంబ సభ్యుల మరణం తరువాత ఈ సమాచారాన్ని బ్యాంకుకు ఇవ్వడానికి నిర్ణీత కాలపరిమితి ఉంచబడలేదు. బాధితుడి కుటుంబం మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడు ఆ పని చేయవచ్చు. ఆర్‌బిఐ సూచనల మేరకు కుటుంబ సభ్యులు డబ్బు ఉపసంహరించుకోవాలని దరఖాస్తు చేసుకుంటే దాన్ని బ్యాంకు 15 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

NCB Raids Mumbai Bakery : ముంబై బేకరీపై ఎన్సీబీ దాడులు.. గంజాయితో చేసిన కేక్‌లు అమ్మినందుకు ముగ్గురు అరెస్ట్..

Soap Manufacturing : సబ్బుల తయారీతో సంవత్సరానికి 6 లక్షలు..! మోదీ ప్రభుత్వం రుణ సదుపాయం..? పూర్తి వివరాలు తెలుసుకోండి..

Fire In Dreams: కలలో అగ్ని కనిపిస్తే ఏమవుతుంది.? దేనికి సంకేతం.! మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది.!