
ఉజ్వల పథకం కింద కోట్లాది మంది లబ్ధిదారులకు మోదీ ప్రభుత్వం పెద్ద కానుకగా అందించింది. ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై సబ్సిడీని రూ.200కి బదులుగా రూ.300కి పెంచింది. అంటే ఉజ్వల పథకం కింద వచ్చే ప్రజలకు ఇప్పుడు రూ.600 విలువైన గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. దాదాపు 37 రోజుల వ్యవధిలో ప్రభుత్వం రెండోసారి గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించింది. దీని ప్రయోజనం 10 కోట్ల మంది లబ్ధిదారులకు అందనుంది. గత ఆగస్టు 29న ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. దీని ప్రయోజనం దేశంలోని వినియోగదారులందరికీ అందించబడింది.
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని ఎల్పిజి సిలిండర్పై రూ.200 నుండి రూ.300కి పెంచిందని తెలిపారు.
The government has raised subsidy amount for Pradhan Mantri Ujjwala Yojana beneficiaries from Rs 200 to Rs 300 per LPG cylinder: Union minister Anurag Thakur during a briefing on Cabinet decisions pic.twitter.com/Dvf7wXtXQT
— ANI (@ANI) October 4, 2023
అంతకుముందు ఆగస్టు 29న కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 పెంచింది. దీని కింద దేశంలోని గ్యాస్ సిలిండర్ వినియోగదారులందరికీ ఉపశమనం లభించింది. ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచింది. ఆ తర్వాత రూ.700కి లభించే గ్యాస్ సిలిండర్ రూ.600కి అందుబాటులోకి వచ్చిందని అన్నారు.
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించడానికి కొత్త సూచనలు చేయాలని కృష్ణా ట్రిబ్యునల్ను కేంద్రం కేబినెట్ కోరింది. దీంతో కృష్ణా జలాల వివాదానికి ఫుల్స్టాప్ పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కేంద్రమంత్రి అనురాగ్ఠాకూర్.
నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పసుపు ఎగుమతులను రూ.8000 కోట్లకు పెంచాలన్న లక్ష్యంతో బోర్డును ఏర్పాటు చేస్తునట్టు కేంద్రమంత్రి అనురాగ్ఠాకూర్ తెలిపారు. ములుగులో గిరిజన యూనివర్సిటీకి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.880 కోట్లతో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. సమ్మక్క -సారక్క గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు అనురాగ్ ఠాకూర్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి