
Ayushman saarthi: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా సోమవారం ‘ఆయుష్మాన్ సారథి’ అనే పేరుతో పీఎం-జేఏవై వాట్సాప్ చాట్బాట్ను ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులు ఇకపై ఈ పథకానికి సంబంధించిన సేవలను రోజులో 24 గంటలూ, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా కేవలం వాట్సాప్ ద్వారా పొందవచ్చు.
ప్రభుత్వం ప్రకారం.. ఆయుష్మాన్ కార్డులు పొందడానికి, సమాచారం తెలుసుకోవడానికి, లేదా ఫిర్యాదులు చేయడానికి ప్రజలు ఇకపై ప్రభుత్వ కార్యాలయాలకు లేదా కాల్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ చాట్బాట్ నేరుగా పీఎం-జేఏవై వ్యవస్థకు అనుసంధానించి ఉంటుంది. అలాగే నిజ సమయంలో సమాచారాన్ని అందిస్తుంది.
ఇది కూడా చదవండి: SIP: కేవలం రూ.10,000 సిప్తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
లబ్ధిదారులు +91 72908 23838 నంబర్కు వాట్సాప్లో “Hi” అని పంపడం ద్వారా లేదా అధికారిక QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఆయుష్మాన్ సారథిని పొందవచ్చు. ఈ సేవ రోజుకు 24 గంటలు, వారంలో ఏడు రోజులు అందుబాటులో ఉంటుంది.
ఆయుష్మాన్ సారథి చాట్బాట్ అనేది ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన లబ్ధిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం, జాతీయ ఆరోగ్య సంస్థ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఒక కొత్త డిజిటల్ ఆరోగ్య సేవ . ఇది వాట్సాప్ ఆధారిత చాట్బాట్, దీని ద్వారా ప్రజలు ఆయుష్మాన్ యోజనకు సంబంధించిన సమాచారం మరియు సేవలను సులభంగా పొందవచ్చు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు లేదా సహాయ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడం, ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో నివసించే వారి కోసం సేవలను వారి మొబైల్ ఫోన్లలోనే అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యం.
ఇది కూడా చదవండి: Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..
ఇది కూడా చదవండి: Saving Account: బ్యాంకు ఖాతాను మరో నగరానికి మారుస్తున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే నష్టపోతారు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి