AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబానీ కొడుకు పెళ్లికి అతిథులను తీసుకువచ్చేందుకు ఎన్ని విమానాలు బుక్‌ చేశారో తెలుసా? ఎంత ఖర్చు?

జూలై 12న అంబానీ కుమారుడు అనంత - రాధికా వివాహం జరిగిన విషయం తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన నాటి నుంచి పెళ్లి వరకు దాదాపు ఏడు నెలల్లో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. అయితే సంగీత్‌ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి అతిథుల ప్రారంభమైపోయింది. దేశ, విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు వచ్చారు. అయితే వారికి స్వాగతం పలికేందుకు అంబానీలు ఏం ఏర్పాట్లు చేశారు. వివాహానికి ముందు, హల్దీ..

అంబానీ కొడుకు పెళ్లికి అతిథులను తీసుకువచ్చేందుకు ఎన్ని విమానాలు బుక్‌ చేశారో తెలుసా? ఎంత ఖర్చు?
Anant Ambani Radhika Merchant Wedding
Subhash Goud
|

Updated on: Jul 14, 2024 | 12:04 PM

Share

జూలై 12న అంబానీ కుమారుడు అనంత – రాధికా వివాహం జరిగిన విషయం తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన నాటి నుంచి పెళ్లి వరకు దాదాపు ఏడు నెలల్లో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. అయితే సంగీత్‌ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి అతిథుల ప్రారంభమైపోయింది. దేశ, విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు వచ్చారు. అయితే వారికి స్వాగతం పలికేందుకు అంబానీలు ఏం ఏర్పాట్లు చేశారు. వివాహానికి ముందు, హల్దీ, మెహందీ, సంగీత కార్యక్రమం ఊహించదగినది. ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు పెళ్లిలో ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేశారు. మొదటి ప్రీ వెడ్డింగ్‌కు రూ. 1,000 కోట్లు ఖర్చు చేయగా, ఇటలీలోని ఒక ద్వీపానికి విలాసవంతమైన విహారయాత్రలో రెండవ ప్రీ-వెడ్డింగ్‌కు మరింత ఖరీదైనది. ఇప్పుడు ముంబైలోని జియో గార్డెన్‌లో వివాహ వేడుక జరిగింది. దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి ఇది. జూలై 12న వివాహం జరుగగా, 13న శుభ అశీర్వాద్ కార్యక్రమం నిర్వహించగా, 14న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఉంటుంది.

అతిథులను తీసుకురావడానికి ఎంత ఖర్చు చేశారు?

అనంత్-రాధికల వివాహ వేడుకకు అతిథులను రప్పించేందుకు ముఖేశ్ అంబానీ భారీ ప్లాన్ వేసిన సంగతి తెలిసిందే. అతిథులను తీసుకురావడానికి మూడు ఫాల్కన్-2000 జెట్‌లను బుక్ చేశారు. అంతేకాకుండా, అతిథులను ముంబైకి తరలించేందుకు 100 ప్రైవేట్ జెట్‌లను కూడా బుక్ చేశారు. పెళ్లి వేడుకలకే కాదు, విదేశీ అతిథులను కూడా అంబానీ కుటుంబం దేశాన్ని చుట్టేసింది. ప్రయాణ సౌలభ్యం కోసం 100కు పైగా ప్రైవేట్ విమానాలు బుక్ చేశారు. ఈ విమానాన్ని బుక్ చేసేందుకు అంబానీ కుటుంబం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయితే ఈ వేడుకలకు 320 మిలియన్‌ డాలర్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్లు ఆర్కిటెక్చరల్‌ డైజెస్ట్ పత్రిక పేర్కొంది.  బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ సెంటర్‌లో వివాహ వేడుక కారణంగా వాహనాల రాకపోకలను కూడా పరిమితం చేశారు. జూలై 12 నుండి జూలై 15 వరకు, వేదిక సమీపంలోని రోడ్లు వివాహాల కోసం మాత్రమే ట్రాఫిక్ కోసం ఓపెన్‌ చేశారు. ఈ రహదారి మధ్యాహ్నం 1 నుండి అర్ధరాత్రి వరకు సాధారణ ట్రాఫిక్ కోసం మూసివేయబడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us