AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Employees: ఆ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇక రెండు, నాలుగో శనివారాల్లో సెలవు

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రతినెలా రెండో, నాలుగో శనివారాల్లో ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది. ఇందులోభాగంగా ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పనివేళలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు సిబ్బంది శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉదయం 10 గంటలకు కార్యాలయానికి..

Employees: ఆ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇక రెండు, నాలుగో శనివారాల్లో సెలవు
Employees
Subhash Goud
|

Updated on: Jul 14, 2024 | 8:31 AM

Share

సిక్కిం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రతినెలా రెండో, నాలుగో శనివారాల్లో ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది. ఇందులోభాగంగా ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పనివేళలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు సిబ్బంది శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉదయం 10 గంటలకు కార్యాలయానికి చేరుకోవాలని, సాయంత్రం 4:30 గంటల వరకు తమ తమ కార్యాలయాల్లో ఉండాలని ప్రభుత్వం సర్క్యులర్‌లో పేర్కొంది. ఒక ఉద్యోగి 10:30 గంటల తర్వాత కార్యాలయానికి చేరుకున్నట్లయితే లేదా చెల్లుబాటు అయ్యే అధికారిక కారణాలు లేకుండా సాయంత్రం 4:30 గంటలలోపు కార్యాలయం నుండి బయలుదేరినట్లయితే, అతని ఆఫ్‌డే డ్యూటీగా నిర్వహించినట్లు పరిగణిస్తామని తెలిపింది. ఉద్యోగుల హాజరును ఆకస్మికంగా తనిఖీ చేయాలని డిపార్ట్‌మెంటల్ హెడ్‌లను సర్క్యులర్‌లో కోరింది.

వీటికి ప్రసూతి సెలవు ప్రయోజనాలు

ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ కనీసం 40 శాతం వైకల్యం ఉన్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు వారి మొత్తం సేవా వ్యవధిలో గరిష్టంగా 730 రోజుల పిల్లల సంరక్షణ సెలవులను అందించాలని నిర్ణయించింది.

నవంబర్‌లో 2 ప్రత్యేక సెలవులు

హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం అస్సాం ఉద్యోగులకు సెలవు బహుమతిని కూడా ఇచ్చింది. అస్సాం ప్రభుత్వం తన ఉద్యోగులు వారి తల్లిదండ్రులు లేదా అత్తమామలతో సమయం గడపడానికి నవంబర్‌లో రెండు రోజుల ప్రత్యేక క్యాజువల్ సెలవును ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) గురువారం తెలిపింది. ప్రత్యేక సెలవులను వ్యక్తిగత ఆనందం కోసం ఉపయోగించలేరు. తల్లిదండ్రులు లేదా అత్తమామలు లేని వారు ఈ సెలవులకు అర్హులు కాదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు నవంబర్‌లో 6, 8వ తేదీల్లో ఈ ప్రత్యేక సెలవులను ప్రకటించింది. తల్లిదండ్రుల సంరక్షణ, వారిని గౌరవించడం, వారితో గడపడం కోసం మాత్రమే సెలవులను వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది కాకుండా, 9వ తేదీ శనివారం, 10వ తేదీ ఆదివారం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి