Airtel: ఈ రీఛార్జ్ ప్లాన్లలో ప్రమాద బీమా.. ప్రకటించిన ఎయిర్ టెల్.. ఎంతో తెలుసా?

|

Oct 28, 2024 | 4:25 PM

Airtel: కొన్ని రోజుల కిందట రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్‌ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే టారిఫ్‌ ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు వెళ్తున్నారు. కస్టమర్లు వెళ్లకుండా ఎయిర్‌టెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది..

Airtel: ఈ రీఛార్జ్ ప్లాన్లలో ప్రమాద బీమా.. ప్రకటించిన ఎయిర్ టెల్.. ఎంతో తెలుసా?
Airtel
Follow us on

భారతదేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటైన ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు వైద్య బీమాను ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను అమలు చేయడానికి ICICI లాంబార్డ్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ బీమా ప్లాన్‌లను దాని 3 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లలో ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన ఈ ప్లాన్‌లోని ప్రత్యేకతలు ఏమిటి ? ఏ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఈ బీమా అందించనుందో తెలుసుకుందాం.

ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్న టెలికాం కంపెనీలు:

కొన్ని రోజుల క్రితం జియోతో సహా టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచాయి. టెలికాం కంపెనీలు ఊహించని విధంగా ధరలు పెంచడంతో యూజర్లు షాక్ కు గురయ్యారు. దీని కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNLకి మారడం ప్రారంభించారు. ఈ పరిస్థితిలో వినియోగదారులను నిలుపుకోవడం కోసం జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలుప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. ఆ విధంగా ఎయిర్‌టెల్ వినియోగదారులకు అద్భుతమైన ప్రత్యేక ఫీచర్‌ను అందించడానికి ప్లాన్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: Ratan Tata: పెంపుడు కుక్కతో పాటు పని మనుషులకు కూడా ఆస్తి రాసిచ్చిన రతన్‌ టాటా!

ఎయిర్‌టెల్ తన 3 ప్రీపెయిడ్ ప్లాన్‌లలో వైద్య బీమాను అందించాలని యోచిస్తోంది. ఎయిర్‌టెల్ ప్రకారం.. ఈ బీమా పథకం ద్వారా ప్రమాదంలో మరణించిన వారికి రూ.1 లక్ష, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.25,000 అందనుంది.

బీమాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లు:

ఎయిర్‌టెల్ రూ.239, రూ.399, రూ.969 ప్లాన్‌లలో ప్రమాద బీమా ప్రయోజనాలు చేర్చింది ఎయిర్‌టెల్‌. ఈ 3 ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఉపయోగించి రీఛార్జ్ చేసుకునే కస్టమర్‌లు తమ వివరాలను, వ్యక్తిగత సమాచారాన్ని ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్ కంపెనీతో పంచుకోవడానికి ఎయిర్‌టెల్‌ టెలికామ్‌కు అధికారం ఇస్తారు. ఇది వారి బీమాను నిర్ధారిస్తుంది.

ఇది కూడా చదవండి: Aadhaar Update: ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. కొత్త అప్‌డేట్‌.. కేంద్రం కీలక నిర్ణయం!

బీమా పథకం నిబంధనలు, షరతులు:

పైన ఇచ్చిన బీమా ప్లాన్‌తో ప్రీపెయిడ్ ప్లాన్‌లను పొందేందుకు కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి.

  • ఈ ఎయిర్‌టెల్ పాలసీ కేవలం 18 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
  • ఈ స్కీమ్‌లోని సభ్యుడు ఒక్కో పాలసీకి ఒక క్లెయిమ్ మాత్రమే చేయగలరు.
  • వినియోగదారులు పాలసీ వ్యవధిలో గరిష్టంగా 3 క్లెయిమ్‌లు చేయవచ్చు.
  • వినియోగదారులు బహుళ ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ సిమ్‌కార్డులను కలిగి ఉంటే, వారు గరిష్టంగా రూ.5,00,000 వరకు కవరేజీని పొందవచ్చు.
  • రూ.239, రూ.399, రూ.969 ప్లాన్‌ల కింద లభించే ఈ బీమా రీఛార్జ్ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం అవుతుందని గమనించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి