AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. రైలు ఛార్జీలతో విమానంలో ప్రయాణం

ఇది కొద్ది రోజులు మాత్రమే. ఆగస్ట్ 17న విడుదల చేసిన ప్రకటనలో ఎయిర్ ఇండియా ఈ ఆఫర్ గురించి సమాచారం ఇచ్చింది. ఈ ప్రత్యేక సేల్‌లో దేశీయ రూట్లలో టిక్కెట్లు కేవలం రూ.1,470 నుంచి ప్రారంభమవుతున్నాయని తెలిపింది. సంస్థ ఈ సెల్‌లో దేశీయ మార్గాలతో పాటు అంతర్జాతీయ విమానాల టిక్కెట్లు కూడా చౌకగా లభిస్తాయి. ఈ సేల్ 96 గంటలు మాత్రమే. టాటా గ్రూప్ ఎయిర్‌లైన్ ఈ ఆఫర్‌లో మీరు దేశీయ విమానాల

Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. రైలు ఛార్జీలతో విమానంలో ప్రయాణం
Air India
Subhash Goud
|

Updated on: Aug 17, 2023 | 4:03 PM

Share

టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా బ్యాంగ్ ఆఫర్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్‌లో మీరు రైలు ఛార్జీలతో విమానంలో ప్రయాణించవచ్చు. ఇందుకోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఇది కొద్ది రోజులు మాత్రమే. ఆగస్ట్ 17న విడుదల చేసిన ప్రకటనలో ఎయిర్ ఇండియా ఈ ఆఫర్ గురించి సమాచారం ఇచ్చింది. ఈ ప్రత్యేక సేల్‌లో దేశీయ రూట్లలో టిక్కెట్లు కేవలం రూ.1,470 నుంచి ప్రారంభమవుతున్నాయని తెలిపింది. సంస్థ ఈ సెల్‌లో దేశీయ మార్గాలతో పాటు అంతర్జాతీయ విమానాల టిక్కెట్లు కూడా చౌకగా లభిస్తాయి. ఈ సేల్ 96 గంటలు మాత్రమే.

టాటా గ్రూప్ ఎయిర్‌లైన్ ఈ ఆఫర్‌లో మీరు దేశీయ విమానాల కోసం 1,470 రూపాయలకు వన్-వే ఎకానమీ క్లాస్ టిక్కెట్‌ను కూడా పొందవచ్చు. అదే సమయంలో దేశీయ విమానాలకు బిజినెస్ క్లాస్ టిక్కెట్లు రూ.10,130 నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ విమానాల కోసం కూడా కంపెనీ ఇలాంటి ఆకర్షణీయమైన ఆఫర్లను అందించింది.

ఎయిర్ ఇండియా ఈ ప్రత్యేక సేల్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు మీ భవిష్యత్ ప్రయాణాలను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకుంటే మీకు ఎటువంటి కన్వీనియన్స్ రుసుము వసూలు చేయడం ఉండదు. ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లయింగ్ రిటర్న్స్ సభ్యులు అన్ని టిక్కెట్లపై డబుల్ లాయల్టీ బోనస్‌ను కూడా పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ కాలానికి టిక్కెట్లు తీసుకోవచ్చు:

మీరు అధీకృత ట్రావెల్ ఏజెంట్ లేదా ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్ ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకుంటే మీరు ఇప్పటికీ ఆఫర్ ప్రయోజనాన్ని పొందుతారు. కానీ కన్వీనియన్స్ రుసుము చెల్లించాలి. ఎయిర్ ఇండియా ఈ ప్రత్యేక విక్రయం నేటి నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 20వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఉంటుంది. ఈ సెల్‌లో మీరు 1 సెప్టెంబర్ 2023 నుంచి 31 అక్టోబర్ 2023 మధ్య ప్రయాణానికి టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఈ సమయంలో బ్లాక్అవుట్ తేదీలు వర్తిస్తాయి. ఇప్పటికే స్పైస్ జెట్ స్వాతంత్ర్య దినోత్సవ విక్రయాలు జరుగుతున్న తరుణంలో టాటాకు చెందిన ఏవియేషన్ కంపెనీ ప్రత్యేక ఆఫర్ వచ్చింది. స్పైస్ జెట్ సేల్ కూడా ఆగస్ట్ 20తో ముగుస్తుంది. స్పైస్ జెట్ సేల్‌లో టిక్కెట్‌లను రూ. 1,515 ప్రారంభ ధరతో అందిస్తోంది. దీని కింద 15 ఆగస్టు 2023 నుంచి 30 మార్చి 2024 వరకు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి