AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Budget Session : ఇవాళ్టి నుంచి పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగానికి విపక్ష పార్టీలు గైర్హాజరు..!

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ఇవాళ్టి నుంచి  ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ... గత పార్లమెంట్​ సమావేశాల తరహాలోనే ఈసారి కూడా సభలను నిర్వహిస్తున్నారు. ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్​సభ

Parliament Budget Session : ఇవాళ్టి నుంచి పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగానికి విపక్ష పార్టీలు గైర్హాజరు..!
Parliament Budget Session
Sanjay Kasula
|

Updated on: Jan 29, 2021 | 8:37 AM

Share

Parliament Budget Session : పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ఇవాళ్టి నుంచి  ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ… గత పార్లమెంట్​ సమావేశాల తరహాలోనే ఈసారి కూడా సభలను నిర్వహిస్తున్నారు. ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్​సభ సమావేశాలు జరుగుతాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగానికి విపక్ష పార్టీలు గైర్హాజరు కానున్నాయి. ఇలాంటి సమయంలో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న విపక్షాల డిమాండ్​తో.. సమావేశాలు సజావుగా సాగుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే జారీ చేసిన వివిధ ఆర్డినెన్స్​లను చట్టాలుగా మార్చేందుకు.. సంబంధిత బిల్లులను ఇరు సభల ముందుకు తీసుకురానుంది కేంద్రం.

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ చేసే ప్రసంగంతో బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇదే రోజున ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచనుంది. అయితే, సాగుచట్టాలపై పోరాటం చేస్తున్న అన్నదాతలకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్టు 16 విపక్ష పార్టీలు ప్రకటించాయి. గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన హింసాకాండపై విచారణ జరిపించాలని డిమాండ్​ చేశాయి.

ఇదిలావుంటే.. బహిష్కరణపై పునరాలోచించుకోవాలని విపక్షాలను కేంద్రం కోరింది. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం మంచి పరిణామం కాదని తెలిపింది. సమావేశాల తొలి భాగంలో బిల్లులు తీసుకురావట్లేదని ప్రభుత్వం వెల్లడించింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే ధన్యవాదాల తీర్మానంపై చర్చ ఉంటుందని వెల్లడించింది. బడ్జెట్ సమావేశాల్లో 4 ఆర్డినెన్స్‌లను ఆమోదించేందుకు సిద్ధమైంది.

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలను రెండు భాగాలుగా కేంద్రం విభజించింది. శుక్రవారం మొదలయ్యే సమావేశాలు వచ్చే నెల 15తో ముగుస్తాయి. అనంతరం పార్లమెంట్​ మార్చి 8న తిరిగి సమావేశం కానుంది. కరోనా కారణంగా ఈ ఏడాది పేపర్ లెస్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో సభ ముందుకు బడ్జెట్​ ప్రతులు, ఆర్థిక​ సర్వే డాక్యుమెంట్లు వచ్చిన అనంతరం.. వాటిని ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచనున్నారు.

ఇవి కూడా చదవండి :

Double Bedroom Houses : నెరవేరుతున్న హైదరాబాదీల సొంతింటి కల.. డబుల్​ బెడ్​రూం ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం..

Follow Us
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!