AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Budget Session : ఇవాళ్టి నుంచి పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగానికి విపక్ష పార్టీలు గైర్హాజరు..!

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ఇవాళ్టి నుంచి  ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ... గత పార్లమెంట్​ సమావేశాల తరహాలోనే ఈసారి కూడా సభలను నిర్వహిస్తున్నారు. ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్​సభ

Parliament Budget Session : ఇవాళ్టి నుంచి పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగానికి విపక్ష పార్టీలు గైర్హాజరు..!
Parliament Budget Session
Sanjay Kasula
|

Updated on: Jan 29, 2021 | 8:37 AM

Share

Parliament Budget Session : పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ఇవాళ్టి నుంచి  ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ… గత పార్లమెంట్​ సమావేశాల తరహాలోనే ఈసారి కూడా సభలను నిర్వహిస్తున్నారు. ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్​సభ సమావేశాలు జరుగుతాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగానికి విపక్ష పార్టీలు గైర్హాజరు కానున్నాయి. ఇలాంటి సమయంలో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న విపక్షాల డిమాండ్​తో.. సమావేశాలు సజావుగా సాగుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే జారీ చేసిన వివిధ ఆర్డినెన్స్​లను చట్టాలుగా మార్చేందుకు.. సంబంధిత బిల్లులను ఇరు సభల ముందుకు తీసుకురానుంది కేంద్రం.

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ చేసే ప్రసంగంతో బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇదే రోజున ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచనుంది. అయితే, సాగుచట్టాలపై పోరాటం చేస్తున్న అన్నదాతలకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్టు 16 విపక్ష పార్టీలు ప్రకటించాయి. గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన హింసాకాండపై విచారణ జరిపించాలని డిమాండ్​ చేశాయి.

ఇదిలావుంటే.. బహిష్కరణపై పునరాలోచించుకోవాలని విపక్షాలను కేంద్రం కోరింది. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం మంచి పరిణామం కాదని తెలిపింది. సమావేశాల తొలి భాగంలో బిల్లులు తీసుకురావట్లేదని ప్రభుత్వం వెల్లడించింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే ధన్యవాదాల తీర్మానంపై చర్చ ఉంటుందని వెల్లడించింది. బడ్జెట్ సమావేశాల్లో 4 ఆర్డినెన్స్‌లను ఆమోదించేందుకు సిద్ధమైంది.

పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలను రెండు భాగాలుగా కేంద్రం విభజించింది. శుక్రవారం మొదలయ్యే సమావేశాలు వచ్చే నెల 15తో ముగుస్తాయి. అనంతరం పార్లమెంట్​ మార్చి 8న తిరిగి సమావేశం కానుంది. కరోనా కారణంగా ఈ ఏడాది పేపర్ లెస్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో సభ ముందుకు బడ్జెట్​ ప్రతులు, ఆర్థిక​ సర్వే డాక్యుమెంట్లు వచ్చిన అనంతరం.. వాటిని ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచనున్నారు.

ఇవి కూడా చదవండి :

Double Bedroom Houses : నెరవేరుతున్న హైదరాబాదీల సొంతింటి కల.. డబుల్​ బెడ్​రూం ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం..

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ