చంద్రబాబు అలా చేస్తే టీడీపీలో చేరతా: కొలుసు
విజయవాడ: కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు కొలుసు పార్ధసారధి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరతారంటూ వస్తున్న వర్తాలపై స్పందించారు. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు టీడీపీని వీడి వైసీపీలోకి వస్తేనే తాను వైసీపీని వీడి టీడీపీలో చేరతానని అన్నారు. తాను పార్టీ మారుతున్నానంటూ అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పార్ధసారధి విమర్శించారు. తాను నూజివీడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని, అసంతృప్తితో ఉన్నానంటూ చేస్తున్న ప్రచారం కూడా తప్పేనని స్పష్టం చేశారు. […]
విజయవాడ: కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు కొలుసు పార్ధసారధి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరతారంటూ వస్తున్న వర్తాలపై స్పందించారు. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు టీడీపీని వీడి వైసీపీలోకి వస్తేనే తాను వైసీపీని వీడి టీడీపీలో చేరతానని అన్నారు. తాను పార్టీ మారుతున్నానంటూ అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పార్ధసారధి విమర్శించారు.
తాను నూజివీడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని, అసంతృప్తితో ఉన్నానంటూ చేస్తున్న ప్రచారం కూడా తప్పేనని స్పష్టం చేశారు. జరగనున్న ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ఈ నియోజకవర్గానికి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నాయకుడు బోడె ప్రసాద్ దోపీడీనే ధ్యేయంగా పని చేస్తున్నారని ఆరోపించారు. తాను ప్రజల మధ్యే ఉంటూ వస్తున్నానని అన్న కొలుసు పార్ధ సారధి పెనమలూరు నియోజకవర్గంలోని చోడవరం గ్రామంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశారు.