కోతుల దాడిలో ఓ మహిళ మృతి

కోతుల దాడిలో ఓ మహిళ మృతి చెందడం కలకలం రేపుతోంది. సిద్ధిపేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. హుస్నాబాద్ మండలం పందిళ్లలో భద్రవ్వ అనే మహిళపై దాడి చేశాయి కోతులు. దీంతో అక్కడిక్కడే మృతి చెందింది భద్రవ్వ. కోతుల దాడిలో ఓ మహిళ మృతి చెందడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతులు యదేచ్ఛగా సంచరిస్తున్నా, వాటిని అదుపు చేసేవాళ్లు లేరని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవుల నుంచి ఇళ్ల దగ్గరికి వస్తున్న […]

కోతుల దాడిలో ఓ మహిళ మృతి
Follow us

| Edited By:

Updated on: Feb 25, 2019 | 4:21 PM

కోతుల దాడిలో ఓ మహిళ మృతి చెందడం కలకలం రేపుతోంది. సిద్ధిపేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. హుస్నాబాద్ మండలం పందిళ్లలో భద్రవ్వ అనే మహిళపై దాడి చేశాయి కోతులు. దీంతో అక్కడిక్కడే మృతి చెందింది భద్రవ్వ. కోతుల దాడిలో ఓ మహిళ మృతి చెందడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతులు యదేచ్ఛగా సంచరిస్తున్నా, వాటిని అదుపు చేసేవాళ్లు లేరని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవుల నుంచి ఇళ్ల దగ్గరికి వస్తున్న కోతులు మనుషులపై దాడి చేసి, ఏకంగా ప్రాణాలు తీస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కోతుల నుంచి తమకు రక్షణ కావాలని కోరుతున్నారు.