సీనియర్లు డెడ్ బాడీస్.. కాంగ్రెస్‌లో కాకరేపిన కామెంట్లు

అధికారంలో వున్నా.. అధికారానికి దూరమైనా కాంగ్రెస్ పార్టీ నేతల తీరే వేరు. అంతర్గత ప్రజాస్వామ్యం అపారంగా వున్న కాంగ్రెస్ పార్టీలో రేగిన రచ్చకు ఇవాళ గాంధీభవన్ మరోసారి మూగ సాక్షిగా నిలిచింది. సాక్షాత్తు జాతీయ నాయకుడు గులాం నబీ ఆజాద్ సమక్షంలో సీనియర్ల మధ్య రగిలిన రచ్చతో గాంధీ భవన్ దద్దరిల్లింది. ఇంతకీ సీనియర్లను డెడ్ బాడీస్ అన్నదెవరు ? కాంగ్రెస్ పార్టీలో ఆర్.ఎస్.ఎస్. రక్తమంటూ ఆరోపించిందెవరు ? మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి ఆధిపత్య పోరుకు […]

సీనియర్లు డెడ్ బాడీస్.. కాంగ్రెస్‌లో కాకరేపిన కామెంట్లు
Follow us

|

Updated on: Nov 05, 2019 | 8:08 PM

అధికారంలో వున్నా.. అధికారానికి దూరమైనా కాంగ్రెస్ పార్టీ నేతల తీరే వేరు. అంతర్గత ప్రజాస్వామ్యం అపారంగా వున్న కాంగ్రెస్ పార్టీలో రేగిన రచ్చకు ఇవాళ గాంధీభవన్ మరోసారి మూగ సాక్షిగా నిలిచింది. సాక్షాత్తు జాతీయ నాయకుడు గులాం నబీ ఆజాద్ సమక్షంలో సీనియర్ల మధ్య రగిలిన రచ్చతో గాంధీ భవన్ దద్దరిల్లింది. ఇంతకీ సీనియర్లను డెడ్ బాడీస్ అన్నదెవరు ? కాంగ్రెస్ పార్టీలో ఆర్.ఎస్.ఎస్. రక్తమంటూ ఆరోపించిందెవరు ? మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసిందెవరు ?
గులాం నబీ ఆజాద్ రాకతో గాంధీభవన్ దద్దరిల్లింది. సీనియర్ల మధ్య కొత్త చిచ్చు రేపింది. తెలంగాణ  కాంగ్రెస్ పార్టీలో కొత్తగా కుదిరిన సమీకరణలు, దోస్తీలు కాక రేపుతున్నాయి. ఇంతకీ గులాం నబీ ఆజాద్ రాకతో ఎందుకు వివాదం రగిలింది ? నిజానికి ఆజాద్ ఎప్పుడొచ్చాడన్నదే వివాదానికి నాందీ ప్రస్తావన. ఆజాద్ రాకతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసాగా మారడానికి ఆజాద్ పర్యటనే కారణమైంది.
సమావేశానికి హాజరైన సీనియర్ నేత వి.హనుమంతరావు ముందుగా ఆజాద్ పర్యటనకు సంబంధించి తనకెందుకు సమాచారం ఇవ్వలేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీని నిలదీయడంతో వివాదాం మొదలైంది. ఆజాద్ జాతీయ నాయకుడు ఆయన రాక సీనియర్లకు తెలపాల్సి వుందంటూ.. కొత్తగా వచ్చిన వారు సీనియర్లను విస్మరిస్తున్నారని వాదించారు. విహెచ్ కామెంట్లతో ఆగ్రహం చెందిన షబ్బీర్ అలీ.. విహెచ్ ఆగ్రహానికి మరింత ఆజ్యం పోశారు. సీనియర్లంతా ఒక రకంగా డెడ్ బాడీస్ అంటూ వృద్ధ నేతలు పార్టీకి భారమన్నట్లు మాట్లాడారు. దాంతో విహెచ్ మరింత రెచ్చిపోయారు. కట్టలు తెగిన ఆవేశం ఇద్దరు నేతలు పరస్పరం బూతులు తిట్టుకున్నారు.
ఆజాద్ సమక్షంలోనే వీరిద్దరు బూతులు తిట్టుకోవడంతో ఆయన మౌనంగా వుండిపోయినట్లు సమాచారం. మిగిలిన వారంతా సముదాయించడంతో షబ్బీర్ సమావేశంలో వుండిపోగా.. విహెచ్ సమావేశం నుంచి అలిగి వెళ్ళిపోయారు. నేరుగా విలేకరుల సమావేశంలోకి వచ్చి… గొడవ జరిగింది వాస్తవమేనని.. మీకు తోచింది మీరు రాసుకోండని మీడియాకు చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. సమావేశంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై  కూడా విహెచ్ ఘాటైన కామెంట్లు చేశారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఆర్.ఎస్.ఎస్. రక్తమని, ఆయనతో షబ్బీర్ గ్రూపు కడుతున్నాడని విహెచ్ ఆరోపించారు.
మొత్తానికి అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో మరోసారి కాక  రేపింది. కాంగ్రెస్ నేతల రూటే సెపరరేటని చాటింది.