AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రొద్దుటూరులో టెన్త్ విద్యార్థినిపై హాస్టల్‍లోనే అత్యాచార౦

సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరులో టెన్త్ స్టూడెంట్‌పై అత్యాచారం జరగడం కలకలం రేపింది. ఆమెతో చదువుతున్న విద్యార్థి, పూర్వ విద్యార్థితో కలిసి హాస్టల్ రూమ్‌లోనే ఈ దారుణానికి పాల్పడటం దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శివారు గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని స్కూల్ పైనున్న హాస్టల్‌లో ఉంటూ అక్కడే చదువుకుంటోంది. ఈ నేపథ్యంలోనే అదే పాఠశాలలో గతంలో చదువుకున్న ఓ విద్యార్థి ఆమెపై కన్నేశాడు. […]

ప్రొద్దుటూరులో టెన్త్ విద్యార్థినిపై హాస్టల్‍లోనే అత్యాచార౦
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 01, 2019 | 3:50 PM

Share

సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరులో టెన్త్ స్టూడెంట్‌పై అత్యాచారం జరగడం కలకలం రేపింది. ఆమెతో చదువుతున్న విద్యార్థి, పూర్వ విద్యార్థితో కలిసి హాస్టల్ రూమ్‌లోనే ఈ దారుణానికి పాల్పడటం దిగ్భ్రాంతికి గురిచేసింది.

ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శివారు గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని స్కూల్ పైనున్న హాస్టల్‌లో ఉంటూ అక్కడే చదువుకుంటోంది. ఈ నేపథ్యంలోనే అదే పాఠశాలలో గతంలో చదువుకున్న ఓ విద్యార్థి ఆమెపై కన్నేశాడు. బాలిక హాస్టల్‌లో ఒంటరిగా ఉండటాన్ని గుర్తించిన అతడు మరో విద్యార్థి సాయంతో హాస్టల్‌లోనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వారు వెళ్లిపోయారు.

బాధితురాలు తనపై జరిగిన అత్యాచారాన్ని స్కూల్ యాజమాన్యానికి చెప్పినా వారు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని బయటపెడితే పరీక్షల్లో ఫెయిల్ చేయిస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు పాఠశాల పైఅంతస్తు నుంచి దూకేసింది. ఈ ఘటనలో ఆమె రెండు కాళ్లు విరగడంతో పాటు నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పాఠశాల యాజమాన్యం బాలికను గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించింది. మంగళవారం బాధితురాలి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి హాస్టల్‌లో జారిపడిందని అబద్ధం చెప్పారు. బాలిక బంధువులు ఆస్పత్రికి వచ్చి ఆరాతీయగా తనపై జరిగిన అఘాయిత్యం, స్కూల్ యాజమాన్యం స్ప‌దించిన తీరు చెప్పి భోరుమంది. దీంతో బాలిక బంధువులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.