AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసోంలో ఒకే రోజు రెండు సార్లు భూ ప్రకంపనలు

ఈశాన్య భారతం మరోసారి భూ ప్రకంపనలతో వణికిపోయింది. ఇవాళ ఒక్కరోజే రెండు సార్లు భూమి కంపించిందని అధికారులు ప్రకటించారు. అసోం రాష్ట్రంలో సంభవించిన ప్రకంపనలు పొరుగున ఉన్న మేఘాలయ వరకు కనిపించిందని అధికారులు తెలిపారు. అయితే, ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు.

అసోంలో ఒకే రోజు రెండు సార్లు భూ ప్రకంపనలు
Earthquake
Balaraju Goud
|

Updated on: Jul 16, 2020 | 7:43 PM

Share

ఈశాన్య భారతం మరోసారి భూ ప్రకంపనలతో వణికిపోయింది. ఇవాళ ఒక్కరోజే రెండు సార్లు భూమి కంపించిందని అధికారులు ప్రకటించారు. అసోం రాష్ట్రంలో సంభవించిన ప్రకంపనలు పొరుగున ఉన్న మేఘాలయ వరకు కనిపించిందని అధికారులు తెలిపారు. అయితే, ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. కరీంగంజ్‌ ప్రాంతంలో ఉదయం 7.57 గంటలకు రిక్టర్‌ సేలుపై 4.1 తీవ్రతతో నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెయిస్మాలజీ తెలిపింది. భూమికి 18 కిలోమీటర్ల దిగువన భూప్రకంపణ కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. దీని ప్రభావం మేఘాలయవ్యాప్తంగా కనిపించిందన్నారు. షిల్లాంగ్, పశ్చిమ గారో హిల్స్ ప్రాంతంలో బలమైన ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు.

రెండోసారి మధ్యాహ్నం 1.09గంటలకు భూమి కంపించిందని, పశ్చిమ అసోం కోక్రాజర్‌లో భూమికి 11 కిలోమీటర్ల దిగువన భూప్రకంపన కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రకంపన తీవ్రత 2.6గా నమోదైంది. దీని ప్రభావం పశ్చిమ మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిందని, వాటి వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా భూకంపాలు చోటు చేసుకుంటుండగా, గత నెలలో వరుస ప్రకంపనలు సంభవించాయి. ఇవి ఎక్కువగా మిజోరం రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. వరుస భూప్రకంపనలతో ఈశాన్య భారత ప్రజలు భయంతో వణికిపోతున్నారు.