AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking ఏపీలో ఒక్కరోజే 24 కరోనా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. శుక్రవారం (ఏప్రిల్ 10) రాత్రి 9 గంటల నుంచి శనివారం (ఏప్రిల్ 11) సాయంత్రం 5 గంటల మధ్య కాలంలో ఏకంగా 24 కరోనా పాజిటివ్ కేసులు ఏపీలో నమోదయ్యాయి.

Breaking ఏపీలో ఒక్కరోజే 24 కరోనా కేసులు
Rajesh Sharma
| Edited By: |

Updated on: Apr 11, 2020 | 6:49 PM

Share

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. శుక్రవారం (ఏప్రిల్ 10) రాత్రి 9 గంటల నుంచి శనివారం (ఏప్రిల్ 11) సాయంత్రం 5 గంటల మధ్య కాలంలో ఏకంగా 24 కరోనా పాజిటివ్ కేసులు ఏపీలో నమోదయ్యాయి. ఇందులో ఒక్క గుంటూరు జిల్లాలోనే 17 కేసులు రికార్డు కాగా.. కర్నూలులో అయిదు, ప్రకాశం, కడప జిల్లాలలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. దాంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405కు చేరుకుంది.

ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 405 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 11 మంది పలు పరీక్షల తర్వాత నెగెటివ్‌గా నమోదై.. డిశ్చార్జి అయ్యారు. మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇక మిగిలిన 388 మంది ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసొలేషన్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన వారిలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిఘీ జమాత్ సదస్సుకు వెళ్ళి వచ్చవారు, వారితో కలిసిన వారే అధికంగా వున్నట్లు అధికారులు చెబుతున్నారు.