తమిళనాడు హెల్త్ సెక్రటరీ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో నమోదైతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రెండో రాష్ట్రంగా తమిళనాడు ఉంది. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలను వైరస్..
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో నమోదైతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రెండో రాష్ట్రంగా తమిళనాడు ఉంది. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలను వైరస్ తాకుతోంది. తాజాగా.. రాష్ట్ర హెల్త్ సెక్రటరీ జే రాధాకృష్ణన్ కుటుంబ సభ్యుల్లో నలుగురికి కరోనా పాజిటివ్గా తేలింది. ఆయన భార్య, కుమారుడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత వెంటనే రాధాకృష్ణన్కు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు నెగెటివ్గా తేలింది. కాగా, ఆయన మామ,అత్త గత వారమే కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం నలుగురు సభ్యులు కూడా చెన్నైలోని గిండి కింగ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రిసెర్చ్లో చికిత్స పొందుతున్నారు.
కాగా, తమిళనాడులో సోమవారం నాడు కొత్తగా మరో 4,985 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,75,678కి చేరింది. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా చెన్నై నగరంలోనే నమోదవుతున్నాయి.