తెలంగాణలో వీటికి మాత్రం అనుమతి లేదు..

హైదరాబాద్‌: రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌ డౌన్‌ కొనసాగుతుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కొన్నింటికి మాత్రం అనుమతులు ఉండబోవని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అన్ని రకాల విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు అనుమతి లేదు. సినిమాథియేటర్లు, పంక్షన్‌ హాల్స్‌కు అనుమతి లేదు. బార్లు, పబ్బులు, క్రీడామైదానాలు.,క్లబ్‌ లు, జిమ్‌లు, పార్కులు మూసివేసి ఉంటాయి. మెట్రో రైలు సర్వీసులు తిరగవు. ఇక హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులను అనుమతించరు. అన్ని రకాల ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు మూసవేసి […]

తెలంగాణలో వీటికి మాత్రం అనుమతి లేదు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 18, 2020 | 9:19 PM

హైదరాబాద్‌: రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌ డౌన్‌ కొనసాగుతుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కొన్నింటికి మాత్రం అనుమతులు ఉండబోవని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

అన్ని రకాల విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు అనుమతి లేదు. సినిమాథియేటర్లు, పంక్షన్‌ హాల్స్‌కు అనుమతి లేదు. బార్లు, పబ్బులు, క్రీడామైదానాలు.,క్లబ్‌ లు, జిమ్‌లు, పార్కులు మూసివేసి ఉంటాయి. మెట్రో రైలు సర్వీసులు తిరగవు. ఇక హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులను అనుమతించరు. అన్ని రకాల ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు మూసవేసి ఉంటాయి. లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.