ఒకసారి ఛార్జి చేస్తే.. 300 కి.మీ దూరం.. టాటా కారు అదుర్స్..
ప్రస్తుతం ఇంధనంతో నడిచే కార్లకంటే.. ఎలక్ట్రిక్ కార్లకే డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో కంపెనీలు కూడా కస్టమర్లను ఆకర్షించేలా సరికొత్త ఫ్యూచర్స్తో కొత్త కార్లను మార్కెట్లో పరిచయం చేస్తున్నాయి. ఈ క్రమంలో టాటా మోటర్స్ కూడా సరికొత్త ఎలక్ట్రిక్ కార్ను త్వరలో లాంచ్ చేస్తోంది. “నిక్సన్ ఈవీ” అనే కొత్త రకం కారును డిసెంబర్ 19న మార్కెట్కు పరిచయం చేయనుంది. తొలుత రెండు రోజుల ముందే అనగా.. డిసెంబర్ 17 లాంచింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నా.. కొన్ని అనివార్య […]
ప్రస్తుతం ఇంధనంతో నడిచే కార్లకంటే.. ఎలక్ట్రిక్ కార్లకే డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో కంపెనీలు కూడా కస్టమర్లను ఆకర్షించేలా సరికొత్త ఫ్యూచర్స్తో కొత్త కార్లను మార్కెట్లో పరిచయం చేస్తున్నాయి. ఈ క్రమంలో టాటా మోటర్స్ కూడా సరికొత్త ఎలక్ట్రిక్ కార్ను త్వరలో లాంచ్ చేస్తోంది. “నిక్సన్ ఈవీ” అనే కొత్త రకం కారును డిసెంబర్ 19న మార్కెట్కు పరిచయం చేయనుంది. తొలుత రెండు రోజుల ముందే అనగా.. డిసెంబర్ 17 లాంచింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నా.. కొన్ని అనివార్య కారణాలతో ఈ ప్రోగ్రాంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కాగా, ఈ “నిక్సన్ ఈవీ” కారును ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(జనవరి-మార్చి)లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కారును.. కంపెనీ సరికొత్త జిపట్రాన్ ఎలక్ట్రానిక్ పవర్ ట్రైన్ టెక్నాలజీతో తయారు చేయనున్నారు. ఇలా తయారుచేసే తొలికారు ఇదే కావడం విశేషం.
నిక్సన్ ఈవీ ప్రత్యేకతలు..
దీనిలో పర్మినెంట్ మాగ్నెట్ ఏసీ మోటార్ను అమర్చారు. ఇది లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీనిని ఒక సారి ఛార్జి చేస్తే.. దాదాపు 250 నుంచి 300 కి.మీ దూరం ప్రయాణించగలదు. ఈ కారు బ్యాటరీపై కంపెనీ.. 8 సంవత్సరాల వారంటీని కూడా ఇస్తోంది. ఈ బ్యాటరీలో డెడికేటెడ్ మేనేజ్మెంట్సిస్టమ్ను అమర్చారు. ఇది జిపట్రాన్ పవర్ట్రైన్ బ్యాటరీ లైఫ్ను పెంచుతోంది. అంతేకాదు ఇందులో.. స్పెషల్ కూలింగ్ సర్క్యూట్ ఉంది.