AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా రోగులను ఆదుకోండి… సహచరులకు మౌలానా సాద్ పిలుపు

కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన తన సహచరులు, ఇతరులు కూడా విషమ స్థితిలో ఉన్న రోగులకు తమ బ్లడ్ ప్లాస్మా ఇచ్చి వారిని ఆదుకోవాలని తబ్లీఘీ జమాత్ నేత మౌలానా సాద్ కందాల్వీ పిలుపునిచ్చాడు.

కరోనా రోగులను ఆదుకోండి... సహచరులకు మౌలానా సాద్ పిలుపు
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 22, 2020 | 10:12 AM

Share

కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన తన సహచరులు, ఇతరులు కూడా విషమ స్థితిలో ఉన్న రోగులకు తమ బ్లడ్ ప్లాస్మా ఇచ్చి వారిని ఆదుకోవాలని తబ్లీఘీ జమాత్ నేత మౌలానా సాద్ కందాల్వీ పిలుపునిచ్చాడు. ఈ మేరకు మంగళవారం ఓ లేఖను విడుదల చేస్తూ.. ప్రస్తుతం తాను, మరికొందరు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నామని తెలిపాడు. క్వారంటైన్ కి తరలించిన తమ సంస్థ సభ్యుల్లో చాలామందికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని, వారికి నెగెటివ్ రిపోర్టు వచ్చిందని సాద్ వెల్లడించాడు. పాజిటివ్ వఛ్చిన వారిలోనూ చాలామంది చికిత్స పొంది కోలుకుని  డిశ్చార్జ్ అయినట్టు ఆయన పేర్కొన్నాడు. ఇలాంటివారు తమ బ్లడ్ ప్లాస్మా  (యాంటీ బాడీలను) ఇచ్చి ఇతర రోగులను కాపాడాలని కోరాడు. రంజాన్ మాసంలో తమ తబ్లీఘీ సభ్యులంతా ఇళ్లలోనే ఉండి ప్రార్థనలు చేయాలని మౌలానా సాద్ సూచించాడు.

ఢిల్లీలో ఇటీవల ప్లాస్మా చికిత్సతో ఒక రోగి కోలుకున్నట్టు వార్తలు వచ్చాయి.