రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కమలం క్లీన్ స్వీప్… ఇండియా టుడే సర్వే
రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీ క్లీన్స్వీప్ చేస్తుందని ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రాజస్థాన్లో ఏకంగా 23 నుంచి 25 స్థానాల్లో తన హవాను కొనసాగించనుందని ఆ సర్వే తెలిపింది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ 25 కి 25 స్థానాలను కైవసం చేసుకుని ప్రభజంనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాభవాన్ని చవిచూసినా.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఏకంగా 23 నుంచి 25 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. అయితే కాంగ్రెస్కి […]
రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీ క్లీన్స్వీప్ చేస్తుందని ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రాజస్థాన్లో ఏకంగా 23 నుంచి 25 స్థానాల్లో తన హవాను కొనసాగించనుందని ఆ సర్వే తెలిపింది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ 25 కి 25 స్థానాలను కైవసం చేసుకుని ప్రభజంనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాభవాన్ని చవిచూసినా.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఏకంగా 23 నుంచి 25 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. అయితే కాంగ్రెస్కి మాత్రం సున్నా నుంచి రెండు స్థానాలను (0-2) మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని ఇండియాటుడే సర్వే ప్రకటించింది.
ఇక మధ్యప్రదేశ్లో కూడా కమలం పూర్తి మెజారిటీని చూపుతుందని ఇండియా టుడే పేర్కొంది. మొత్తం 29 ఎంపీ స్థానాలకు గాను ఏకంగా 26-28 స్థానాలను కైవసం చేసుకొని ప్రత్యర్థులకు చుక్కలు చూపించనుందని.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 1- 3 స్థానాల్లో సాధించగలదని సర్వే తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది సీట్లతో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ.. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీజేపీ తన పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించనుందని ఇండియాటుడే వెల్లడించింది.
ఇంకా మిగతా రాష్ట్రాలకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ చూడండి :