యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చేశాయి. జాతీయ మీడియా సంస్థలన్నీ మరోసారి ఎన్డీఏకి పట్టం కట్టాయి. ఏడు విడతలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ఇతర పార్టీల కంటే బీజేపీ మిత్రపక్షాలు దాదాపు 300 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
దీంతో కేంద్రంలో మరోసారి కమలం వికసించినట్లేనని తెలుస్తోంది. మోదీ ప్రభంజనం ముందు విపక్షాలు ఓడిపోయినట్లేనని సర్వేలు తెలుపుతున్నాయి. ఎన్డీఏ కూటమి సంపూర్ణ అధిక్యంతో మరోసారి పగ్గాలు చేపట్టడం తథ్యమని.. తెలుస్తోంది.
ఇప్పటివరకు వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏకపక్షంగా ఎన్డీఏకే జైకొట్టాయి. దాదాపు 300 సీట్లతో మోదీ టీం మరోమారు కేంద్రంలో అధికార పగ్గాలు చేపడుతుందని పేర్కొన్నాయి.
టైమ్స్ నౌ సర్వే…
ఎన్డీఏ- 306
యూపీఏ- 132
ఇతరులు- 104
జన్ కీ బాత్ సర్వే….
ఎన్డీఏ- 295-315
యూపీఏ- 122-125
ఇతరులు- 102-125
సీ-ఓటర్ సర్వే…
ఎన్డీఏ- 287
యూపీఏ- 128
ఎస్పీ-బీఎస్పీ కూటమి- 40
ఇతరులు- 87
ఎబీపీ న్యూస్..
ఎన్డీఏ- 267
యూపీఏ-127
ఇతరులు-148
రిపబ్లిక్ టీవీ..
ఎన్డీఏ-287
యూపీఏ-129
ఇతరులు-127
ఎన్డీటీవీ..
ఎన్డీఏ-302
యూపీఏ-127
ఇతరులు-133
టైమ్స్ ఆఫ్ ఇండియా..
ఎన్డీఏ-306
యూపీఏ-152
ఇతరులు-84
ఇండియా టుడే..
ఎన్డీఏ-232-251
యూపీఏ-73-99
ఇతరులు-56-74
సీఎన్ఎన్-ఐబీఎన్…
ఎన్డీఏ-336
యూపీఏ-82
ఇతరులు-124
టుడేస్ చాణక్య..
ఎన్డీఏ-340
యూపీఏ-70
ఇతరులు-132
నేత-న్యూస్ ఎక్స్ మాత్రం కాస్త భిన్నమైన అంచనాలు వెలువరించింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి ఎన్డీఏ కాస్త వెనుకపడుతుందని లెక్కగట్టింది. ఎన్డీఏకు 242, యూపీఏకి 164 సీట్లు రావచ్చని విశ్లేషించింది.