మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం… రాష్ట్రవ్యాప్తంగా పాక్షిక లాక్‌డౌన్.. హోటళ్లు, షాపింగ్‌ మాల్స్ మూసివేత..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ వికృతరూపం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఈసారి భారతదేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయం పెరగుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం... రాష్ట్రవ్యాప్తంగా పాక్షిక లాక్‌డౌన్.. హోటళ్లు, షాపింగ్‌ మాల్స్ మూసివేత..!
Maharashtra To Unlock
Follow us

|

Updated on: Apr 05, 2021 | 6:38 AM

Maharashtra weekend lockdown: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ వికృతరూపం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఈసారి భారతదేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయం పెరగుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయా రాష్ట్రాలకు కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో పాక్షిక లాక్‌ డౌన్‌ ప్రకటించింది ప్రభుత్వం. ఉదయం సమయంలో సెక్షన్‌ 144, రాత్రిపూట కర్ఫ్యూతోపాటు వీకెండ్‌లో అంటే శని, ఆదివారారాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర సేవలను ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. ఆంక్షలు సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వస్తాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్తగా విడుదల చేసిన ఆంక్షలు ఏప్రిల్‌ 30వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొంది మహారాష్ట్ర ప్రభుత్వం.

కరోనా కేసులు పెరగుతుండటంతో పాక్షిక లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకులు స్వాగతించారు. ప్రజలందరూ సహకరించాలని ప్రతిపక్ష నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఈ నియమాలను అమలు చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తుందని దీంతో లాక్‌డౌన్‌ పరిస్థితులు ఏర్పడ్డాయని ఈ విషయంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి అనేక మంది నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, పత్రిక యాజమాన్యం, సంపాదకులతోపాటు అన్ని రంగాల ప్రతినిధులతోపాటు వివిధ పార్టీల నేతలతోనూ విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. ఇలా అందరితో అభిప్రాయాల మేరకు ఆదివారం రాష్ట్ర కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంది.

పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇదిలావుంటే, ఆదివారం ఒక్కరోజే 57 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మినీలాక్‌ డౌన్‌లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేయాలి. ప్రైవేట్‌ ఉద్యోగులు ఇంటి నుంచి (వర్క్‌ ఫ్రం హోం) పనులు చేయాలి. హోటళ్లు, షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, ధార్మిక, దర్శనీయ స్థలాలు, మైదానాలు, జిమ్‌లు, సెలూన్లు మూసి వేయనున్నారు. హోటళ్లు పార్సిల్‌ సేవలు కొనసాగించవచ్చు. రైళ్లు, విమాన సేవలు యథావిధిగా కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది..

Read Also.. సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్‌.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్