త్వరలో టీడీపీలోకి క్యూ కట్టనున్న వైసీపీ నాయకులు: గల్లా

విజయవాడ: గత కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయ వేడి పెరిగింది. పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారు. దీంతో టీడీపీ నాయకుల్లో ఆత్మ విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడిందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయ్‌దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకరిద్దరు టీడీపీ నాయకులు వైసీపీలోకి వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. త్వరలోనే వైసీపీ నుంచి నాయకులు టీడీపీలో చేరబోతున్నట్టు ఆయన చెప్పారు. మోడీని మళ్లీ […]

త్వరలో టీడీపీలోకి క్యూ కట్టనున్న వైసీపీ నాయకులు: గల్లా
Follow us

|

Updated on: Feb 18, 2019 | 9:32 PM

విజయవాడ: గత కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయ వేడి పెరిగింది. పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారు. దీంతో టీడీపీ నాయకుల్లో ఆత్మ విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడిందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయ్‌దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకరిద్దరు టీడీపీ నాయకులు వైసీపీలోకి వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. త్వరలోనే వైసీపీ నుంచి నాయకులు టీడీపీలో చేరబోతున్నట్టు ఆయన చెప్పారు. మోడీని మళ్లీ ప్రధానిని చేయాలని కేసీఆర్, జగన్‌లు తాపత్రయపడుతున్నారని జయ్‌దేవ్ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన పర్యటించారు.