AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ‘కాటు’.. మలేసియా టు కేరళ.. కన్ననూర్ జిల్లా వాసి మృతి

మలేసియా నుంచి కేరళ చేరుకున్న ఓ వ్యక్తి కరోనా (కోవిడ్-19) వ్యాధితో మరణించాడు. ఇతడ్ని 36 ఏళ్ళ జైనేష్ గా గుర్తించారు. మలేసియాలో రెండున్నర సంవత్సరాలుగా పని చేస్తున్న ఈ వ్యక్తి ఇటీవల కేరళ చేరుకున్నాడు.

కరోనా 'కాటు'.. మలేసియా టు కేరళ.. కన్ననూర్ జిల్లా వాసి మృతి
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 29, 2020 | 3:41 PM

Share

మలేసియా నుంచి కేరళ చేరుకున్న ఓ వ్యక్తి కరోనా (కోవిడ్-19) వ్యాధితో మరణించాడు. ఇతడ్ని 36 ఏళ్ళ జైనేష్ గా గుర్తించారు. మలేసియాలో రెండున్నర సంవత్సరాలుగా పని చేస్తున్న ఈ వ్యక్తి ఇటీవల కేరళ చేరుకున్నాడు. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన జైనేష్.. విపరీతమైన జ్వరం, దగ్గు, ఆయాసంతో బాధ పడుతుండగా.. అతడ్ని వెంటనే ఎర్నాకులం జిల్లా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి

ఐసొలేషన్ వార్డులో చేర్చారు. ఇతనికి మొదట కరోనా నెగెటివ్ లక్షణాలు ఉన్నట్టు కనబడ్డాయి. అయితే న్యుమోనియాతో కూడా బాధపడుతూ,, డయాబెటిస్ సైతం ఉన్న ఈ వ్యక్తికి సంబంధించిన రెండో శాంపిల్ టెస్ట్ రిపోర్టు కూడా రాకముందే మృతి చెందాడు. కన్ననూర్ జిల్లాకు చెందిన జైనేష్.బ్లడ్ ని వైరాలజీ ఇన్స్ టి ట్యూట్ కి పంపగా..  ఈ తాజా టెస్టులో.. ఈయనకు  స్వైన్ ఫ్లూ తో బాటు కరోనా కూడా సోకినట్టు గుర్తించారు. ఈ వ్యక్తి మృతితో ముఖ్యంగా ఎర్నాకులం జిల్లాలో  17 మందిని అబ్జర్వే షన్ లో ఉంచారు. మరో 27 మందిని  వారి ఇళ్లలో 14 రోజుల పాటు వైద్య సంబంధ నిఘాలో ఉంచినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆ మధ్య చైనా లోని వూహాన్ నుంచి కేరళ చేరుకున్న ముగ్గురికి కరోనా సోకినట్టు అనుమానించి ఆసుపత్రులకు తరలించారు. అయితే ఆ ముగ్గురూ కోలుకుని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. తాజా కేసుతో రాష్ట్రం అప్రమత్తమైంది.