AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్‌ను పావులా వాడుకుంటున్నారు: చంద్రబాబు

విజయవాడ: ఏపీని సామంత రాజ్యంగా చేసుకోవాలనే కుట్రలు జరుగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్, ఢిల్లీ పాలకులే టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రులను టీఆర్ఎస్ వేధిస్తోందని ఆరోపించారు. ఏపీ రాజకీయాల్లో తాము చెప్పినట్టుగా పని చేయాలంటూ టీఆర్ఎస్ బెదిరిస్తోందని అన్నారు. మరోపక్క ద్వితియ శ్రేణి టీడీపీ నాయకులపై మోడీ ఐటీ దాడులు చేయిస్తున్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా భయపడేది లేదని, ఎదురించి పోరాడతామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన ద్వారా ఆస్తులు పోయినా ఆత్మ […]

జగన్‌ను పావులా వాడుకుంటున్నారు: చంద్రబాబు
Vijay K
|

Updated on: Feb 21, 2019 | 7:18 PM

Share

విజయవాడ: ఏపీని సామంత రాజ్యంగా చేసుకోవాలనే కుట్రలు జరుగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్, ఢిల్లీ పాలకులే టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రులను టీఆర్ఎస్ వేధిస్తోందని ఆరోపించారు. ఏపీ రాజకీయాల్లో తాము చెప్పినట్టుగా పని చేయాలంటూ టీఆర్ఎస్ బెదిరిస్తోందని అన్నారు. మరోపక్క ద్వితియ శ్రేణి టీడీపీ నాయకులపై మోడీ ఐటీ దాడులు చేయిస్తున్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా భయపడేది లేదని, ఎదురించి పోరాడతామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన ద్వారా ఆస్తులు పోయినా ఆత్మ గౌరవం కోసం పోరాడతామని అన్నారు.