AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడో టీ-20లో భారత్ ఘన విజయం.. 2-0తో సిరీస్ కైవసం!

శుక్రవారం పూణేలో జరిగిన 3వ టి20 లో భారత్ శ్రీలంకను 78 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో సిరీస్‌ను 2-0తో భారత్ గెలుచుకుంది. . 202 పరుగుల భారీ టార్గెట్‌ను శ్రీలంక ఛేదించలేకపోయింది. తమ ఛేజింగ్ ను చెత్తగా ప్రారంభించింది. మొదటి 4 ఓవర్లలో 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడిపోయింది. భారత బౌలర్లు జస్‌ప్రీత్‌బుమ్రా, శార్దూల్, సుందర్, నవదీప్ సైనిలు బాగా రాణించారు. 68 పరుగుల భాగస్వామ్యంతో ఏంజెలో మాథ్యూస్ (20 బంతుల్లో […]

మూడో టీ-20లో భారత్ ఘన విజయం.. 2-0తో సిరీస్ కైవసం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 11, 2020 | 5:12 AM

Share

శుక్రవారం పూణేలో జరిగిన 3వ టి20 లో భారత్ శ్రీలంకను 78 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో సిరీస్‌ను 2-0తో భారత్ గెలుచుకుంది. . 202 పరుగుల భారీ టార్గెట్‌ను శ్రీలంక ఛేదించలేకపోయింది. తమ ఛేజింగ్ ను చెత్తగా ప్రారంభించింది. మొదటి 4 ఓవర్లలో 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడిపోయింది. భారత బౌలర్లు జస్‌ప్రీత్‌బుమ్రా, శార్దూల్, సుందర్, నవదీప్ సైనిలు బాగా రాణించారు.

68 పరుగుల భాగస్వామ్యంతో ఏంజెలో మాథ్యూస్ (20 బంతుల్లో 31), ధనంజయ డిసిల్వా (36 బంతుల్లో 57) శ్రీలంక బ్యాటింగ్ లో రాణించారు. వీరిద్దరూ మ్యాచ్‌ను ఉత్కంఠభరితమైన ముగింపుకు తీసుకువెళుతున్నట్లు కొంతసేపు అనిపించింది. కానీ మాథ్యూస్ వికెట్ శ్రీలంక లోయర్ ఆర్డర్ పతనానికి దారితీసింది. అంతకుముందు, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్‌తో కలిసి భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. కానీ మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. అయినప్పటికీ శ్రీలంకపై భారత్ 6 వికెట్లకు 201 పరుగులు చేసింది.