హైదరాబాద్ డెలివరీ మ్యాన్‌కు పాజిటివ్.. మార్చి 19న ఆయన కలిసిందెవరినో

తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ వంటి వాటిని నిరవధికంగా నిషేధించిన నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూసింది. తబ్లిఘీ జమాత్ సదస్సుకు వెళ్ళి వచ్చిన తన సోదరుని ద్వారా సదరు డెలివరీ మ్యాన్‌కు...

హైదరాబాద్ డెలివరీ మ్యాన్‌కు పాజిటివ్.. మార్చి 19న ఆయన కలిసిందెవరినో
Follow us

|

Updated on: Apr 20, 2020 | 12:45 PM

తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ వంటి వాటిని నిరవధికంగా నిషేధించిన నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూసింది. తబ్లిఘీ జమాత్ సదస్సుకు వెళ్ళి వచ్చిన తన సోదరుని ద్వారా సదరు డెలివరీ మ్యాన్‌కు కరోనా పాజిటివ్ సోకినట్లు తేలడంతో అధికారులు, పోలీసులు ఆయన ఎవరెవరికి ఫుడ్ డెలివరీ చేసాడనే కోణంలో కాంటాక్టు ట్రేసింగ్ మొదలు పెట్టారు. అయితే ఈక్రమంలో మార్చ 19వ తేదీ అత్యంత కీలకంగా మారినట్లు అధికారుల చెబుతున్నారు.

హైదరాబాద్ నాంపల్లికి చెందిన ముప్పై ఏళ్ళ డెలివరీ మ్యాన్ కరోనా పాజిటివ్ కేసుల్లో ఒకనిగా తేలాడు. అతని 36 ఏళ్ళ సోదరుడు మార్చిలో ఢిల్లీలో జరిగిన తబ్లిఘీ జమాత్ సదస్సుకు వెళ్ళి రాగా.. అతనింట్లో మొత్తం అయిదుగురికి కరోనా సోకింది. దాంతో మొత్తం కుటుంబాన్ని క్వారెంటైన్‌లో వుంచారు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన వ్యక్తితోపాటు అతని 30 ఏళ్ళ డెలివరీ మ్యాన్ తమ్ముడుకూడా క్వారెంటైన్ పూర్తి చేసుకున్నాడు.

తన అన్న తబ్లిఘీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాను కేవలం ఒకరోజు అంటే మార్చి 18న తన అన్న తిరిగి రాగా.. తాను కేవలం మార్చి 19న మాత్రమే డెలివరీ జాబ్ చేశానని సదరు వ్యక్తి చెబుతున్నాడు. దాంతో ఆ ఒక్కరోజు అతను ఎవరెవరికి ఫుడ్ డెలివరీ ఇచ్చాడనే కోణంలో అధికారులు కాంటాక్టు ట్రేసింగ్ చేస్తున్నారు. ఆ ఒక్కరోజు ఎవరిని కలిశాడు.. వారు మరి ఎంత మందిని ఈ నెల రోజుల్లో కలిసి వుంటారు. వారిలో ఎందరికి కరోనా సోకి వుండొచ్చు అనేదిపుడు టెన్షన్ పుట్టించే విషయంగా మారింది.

ఇన్నాళ్ళు క్వారెంటైన్‌లో వున్న సదరు డెలివరీ మ్యాన్… మొదటి రోజుల్లోనే తాను మార్చి 19న ఫుడ్ డెలివరీ ఇచ్చిన విషయం వెల్లడించి వుంటే కాంటాక్టు ట్రేసింగ్ సులభమై వుండేదని, నెల రోజుల తర్వాత ఈ కాంటాక్టు ట్రేసింగ్ చాలా కష్టమని చెబుతున్నారు అధికారులు. సదరు డెలివరీ మ్యాన్ తాను ఫుడ్ డెలివరీ ఇచ్చిన విషయం రహస్యంగా వుంచడం వెనుక ఉద్దేశాన్ని పోలీసులు కూపీ లాగుతున్నారు.

ఉద్దేశపూర్వకంగానే తాను ఫుడ్ డెలివరీ ఇచ్చిన విషయం దాచి వుంటే మాత్రం అది నేరంగా పరిగణించాల్సి వుంటుంది. కానీ పోలీసులు ఆ దిశగా అడుగులు వేయకపోవడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కాంటాక్టు ట్రేసింగ్ అటు వైద్యాధికారులకు, పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే ఇలాంటి వ్యక్తుల వల్ల మొత్తం సమాజానికే చేటు అని కొందరంటున్నారు.

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్