నది మిగిల్చిన కన్నీళ్లు..ఒకే కుటుంబంలో నలుగురు మహిళల మృతి

| Edited By: Srinu

May 14, 2019 | 7:10 PM

ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు ప్రమాదవశాత్తూ నదిలో మునిగి  చనిపోయారు. బిర్లంగి గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటన జరిగింది. .దూపాన సీతారాం అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య ఢిల్లమ్మ (35), కుమార్తె గాయత్రి (12)తో పాటు సీతారాం తమ్ముడు రాధాశ్యామ్‌ భార్య కమల (32), వారి కుమార్తె అంజలి (12)  నలుగురూ సోమవారం సాయంత్రం బట్టలు ఉతికేందుకు బాహుదా నదికి […]

నది మిగిల్చిన కన్నీళ్లు..ఒకే కుటుంబంలో నలుగురు మహిళల మృతి
Follow us on

ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు ప్రమాదవశాత్తూ నదిలో మునిగి  చనిపోయారు. బిర్లంగి గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటన జరిగింది. .దూపాన సీతారాం అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య ఢిల్లమ్మ (35), కుమార్తె గాయత్రి (12)తో పాటు సీతారాం తమ్ముడు రాధాశ్యామ్‌ భార్య కమల (32), వారి కుమార్తె అంజలి (12)  నలుగురూ సోమవారం సాయంత్రం బట్టలు ఉతికేందుకు బాహుదా నదికి వెళ్లారు. అయితే, వారు ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతిచెందినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు తోటి కోడళ్లు కాగా.. వారి కుమార్తెలు కూడా మృతిచెందడంతో బిర్లంగిలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.