హుజూర్ నగర్ అభ్యర్థులకు ఈసీ షాక్ !

పార్టీల హడావిడితో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న  అభ్యర్థులకు షాకిచ్చే డెసిషన్ తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. అంతేకాదు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బిజెపిలతో పాటు పలువురు ఇండిపెండెంట్లు హుజూర్ నగర్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే లక్ష్యంగా పావులు […]

హుజూర్ నగర్ అభ్యర్థులకు ఈసీ షాక్ !
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 04, 2019 | 6:47 PM

పార్టీల హడావిడితో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న  అభ్యర్థులకు షాకిచ్చే డెసిషన్ తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. అంతేకాదు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బిజెపిలతో పాటు పలువురు ఇండిపెండెంట్లు హుజూర్ నగర్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. విజయమే పరమావధిగా డబ్బులు కుమ్మరిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరందుకున్నాయి. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ గురువారం న్యూఢిల్లీ వెళ్ళి మరీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వచ్చారు. దీని సారాంశమేంటంటే.. తెలంగాణలో అధికారంలో వున్న టిఆర్ఎస్ పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అభియోగం.

లక్ష్మణ్ తోపాటు పలువురు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన దరిమిలా సిఈసీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎన్నికల వ్యయ పరిశీలకున్ని నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 1983 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి బిఆర్ బాలకృష్ణన్ ను కేంద్ర ఎన్నికల సంఘం వ్యయపరిశీలకునిగా నియమించింది. అంతేకాదు ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు  సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లును బదిలీ చేసింది. ఆయన స్థానంలో భాస్కరన్‌ను నియమించింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని, సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లును బదిలీ చేయాలంటూ తెలంగాణ జనసమితి ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఈసీ సూర్యాపేట ఎస్పీని బదిలీ చేసింది.

పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్