AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. తాజా వివరాలు ఇవే..

దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 918 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దీంతో కేసుల సంఖ్య మొత్తం 8447 కు చేరింది. దీంట్లో ప్రస్తుతం 7409 యాక్టివ్‌ ఉన్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి కాంటక్ట్‌లను గుర్తిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు కరోనాను ఎదుర్కొని 765 డిశ్చార్జ్‌ అయ్యారని.. తెలిపారు. కాగా.. కరోనా బారినపడి […]

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 12, 2020 | 5:48 PM

Share

దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 918 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దీంతో కేసుల సంఖ్య మొత్తం 8447 కు చేరింది. దీంట్లో ప్రస్తుతం 7409 యాక్టివ్‌ ఉన్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి కాంటక్ట్‌లను గుర్తిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు కరోనాను ఎదుర్కొని 765 డిశ్చార్జ్‌ అయ్యారని.. తెలిపారు. కాగా.. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 273కు చేరిందన్నారు. గత 24గంటల్లో 31 మంది మృతి చెందారని లవ్ అగర్వాల్ వెల్లడించారు. కాగా.. ఇప్పటికే లాక్‌డౌన్‌ను పలు రాష్ట్రాల్లో ఏప్రిల్ 30 వరకు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశాయి.