AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రాన్ని ముంచేశారు..బాబుపై బావురుమన్న బొత్స

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుపై మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఫైరయ్యారు. ఈసారి బొత్స మాటల్లో తీవ్రత కంటే.. ఆవేదన ఎక్కువగా వ్యక్తమైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పొప్పులపై బొత్స వెల్లడించిన వివరాలు షాక్ కు గురిచేస్తున్నాయి. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల 15 వేల  కోట్లు ఒక్క మునిసిపల్ శాఖలో అప్పులు పడినట్లు బొత్స వివరించారు. టీడీపీ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుంటుపడిందన్నారు బొత్స. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 110 […]

రాష్ట్రాన్ని ముంచేశారు..బాబుపై బావురుమన్న బొత్స
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 03, 2019 | 1:58 PM

Share

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుపై మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఫైరయ్యారు. ఈసారి బొత్స మాటల్లో తీవ్రత కంటే.. ఆవేదన ఎక్కువగా వ్యక్తమైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పొప్పులపై బొత్స వెల్లడించిన వివరాలు షాక్ కు గురిచేస్తున్నాయి. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల 15 వేల  కోట్లు ఒక్క మునిసిపల్ శాఖలో అప్పులు పడినట్లు బొత్స వివరించారు. టీడీపీ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుంటుపడిందన్నారు బొత్స. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 110 మునినిసిపాలిటిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన బొత్స.. గ్రామ సచివాలయాల ఆలోచన చంద్రబాబుకు వస్తే ఎందుకు అమలు చెయ్యలేదని ప్రశ్నించారు. హాస్పిటల్స్ ఉన్న ప్రాంతాల్లో రాజన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నామని చెప్పిన బొత్స.. రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న మాట వాస్తవమని అంగీకరించారు. విద్యుత్ సమస్యపై కేంద్రంతో పక్క రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని బొత్స చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్న బొత్స.. కొత్త ఇసుక పాలసీ అమలులోకి వచ్చాక ఇసుక కొరత తగ్గిందన్నారు. మొత్తానికి బొత్స కామెంట్లు.. చెప్పిన వివరాలు.. ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.